ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన అన్నీ రికార్డ్స్ ని ఒకేదెబ్బతో బ్రేక్ చేయటమే కాకుండా సరికొత్త రికార్డ్స్ కి తెరలేపటం అనేది బాహుబలి2మూవీకే సాధ్యపడింది. ఇంతటి సక్సెస్ సాధించిన మూవీని చూసిన ప్రతి ప్రేక్షకుడు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని ఆస్వాదించాడు. ఇదిలా ఉంటే ఇక బాహుబలి సిరీస్ నిర్మాతలు సైతం ఈ మూవీ ద్వారా భారీ లాభాలను పొందారని అంటున్నారు.

అయితే బాహుబలి నిర్మాతలను బెదించి పైరసీ రూపంలో మనీను సంపాదించుకోవాలి కొందరు ప్రయత్నించి దొరికిపోయిన విషయం తెలిసిందే. మాఫియాలా మారిన ఆ పైరసీ టీంకే బాహుబలి నిర్మాతలు చుక్కలు చూపించారు. ముఖ్యంగా బాహుబలి హిందీ రైట్స్ తీసుకున్న నిర్మాత కరణ్ జోహార్ తనదైన శైలిలో పైరసీ మాఫియాపై స్కెచ్ వేశారు. కరణ్ జోహార్ క్రిమినల్ మైండ్ కి ఒక్కసారిగా పైరసీ మాఫియా షాక్ అయింది.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…ప్రస్తుతం బాహుబలి2 సినిమా గురించి, అది సాధించిన సక్సెస్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఒక పైరసీ ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళు బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్ జిల్లలో ఉన్న థియేటర్ ద్వారా హై క్వాలిటీ ప్రింట్ ను పైరసీ చేసి నిర్మాత కరణ్ జోహార్ తో పాటు,ఇతర నిర్మాతలను సంప్రదించి….15 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో కరణ్ జోహార్ మాస్టర్ ప్లాన్ వేసి ఆ పైరసీ టీంని పోలీసులకి పట్టించారు.

అలాగే ముంబాయ్ లో మరో భారీ మాఫియాని సైతం కరణ్ జోహార్ ఇలాగే పోలీసులకి పట్టించారు. “మొట్టమొదటిసారిగా ఓ ఇండియన్ ఫిల్మ్ హాలీవుడ్ మార్కెట్ ని తలదన్నేలా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ మూవీని పైరసీ చేయకుండా ఉంటే ఇంకా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసేది. మిగతా సినిమాలను పైరసీ చేసుకుంటే నేను అంతగా రియాక్ట్ అయ్యే వాడిని కాదు. బాహుబలి2ని పైరసీ చేయటం కరెక్ట్ కాదు. ఇది క్రైమ్. అందుకే నా క్రిమినల్ మైండ్ తో పోలీసులకి పట్టించాను” అంటూ కరణ్ జోహార్ తనదైన శైలిలో పైరసీ మాఫియాకి క్లాస్ పీకాడంట.


మరింత సమాచారం తెలుసుకోండి: