రాజమౌళి ఇమేజ్ మీద ‘బాహుబలి’ మార్కెట్ అయితే తన ఇమేజ్ ఏమిటో ‘సాహో’ ద్వారా రుచి చూపిస్తున్నాడు ప్రభాస్. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకోబోతున్న ‘సాహో’ కు ఈ మూవీ నిర్మాతలు 150 కోట్లు బడ్జెట్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. 

ఈ సినిమాకు సంబంధించి టీజర్ ఇప్పటికే రిలీజ్ అయి సంచలనాలు క్రియేట్ చేసింది. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వచ్చేనెల నుండి నిర్మాణం ప్రారంభింప బడుతున్న ఈసినిమాకు మొదటి షెడ్యూల్ ఇంకా ప్రారంభం కాకుండానే అత్యంత క్రేజీ ఆఫర్ ను దక్కించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈసినిమా ప్రపంచ హక్కులను బాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ 350 కోట్లకు మొత్తంగా తీసుకోవడానికి భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే ‘సాహో’ షూటింగ్ ఇంకా ప్రారంభం కాకుండానే 200 కోట్ల లాభంలోకి వెళ్లిపోయినట్లు అనుకోవాలి. 

ప్రస్తుతం ఈ డీల్ కు సంబంధించి ప్రాధమిక చర్చలు జరుగుతున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ జియోనీ తన ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రభాస్ ను నియమించుకోవడానికి 100 కోట్ల భారీ డీల్ కూడ ప్రభాస్ తో జియోనీ సెల్ కంపెనీ ప్రతినిధులు అమెరికా వెళ్లి చర్చలు జరుపుతున్నట్లు టాక్.

ఈ కంపెనీ తన సెల్ ప్రోడక్ట్ కు సంబంధించి టివి, అవుట్ డోర్ ప్రింట్ రేడియో డిజిటల్ మీడియా పబ్లిసిటీ కోసమే భారీ మొత్తాలు తన బడ్జెట్ లో క్రియేట్ చేసిన నేపధ్యంలో ఈ బ్రాండ్ ఎండార్స్ మెంట్ ద్వారా ప్రభాస్ ఫోటోలు జాతీయ స్థాయిలో ఎక్కడ చూసినా కనిపిస్తాయి. వివో, మైక్రోమాక్స్ ల తరువాత అత్యంత ప్రజాదారణ తరువాత జియోనీ సంస్థకు ప్రభాస్ బ్రాండ్ అంబాసిడర్ గా మారితే ఇండియన్ టాప్ స్టార్ గా ప్రభాస్ స్థానం సుస్థిరం అయిపోవడం ఖాయం..     
 



మరింత సమాచారం తెలుసుకోండి: