తెలుగు బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ‘జబర్ధస్త్’ కామెడీ షో.  ఇప్పటి వరకు ఎన్నో కామెడీ సీరియల్స్ వచ్చాయి..కానీ జబర్ధస్త్ కామెడీ షో మాత్రం బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. ‘జబర్ధస్త్’ కామెడీ షో తో ఎంతో మంది ఔత్సాహికులు మంచి పోజీషన్ లోకి వచ్చారు.  అంతే కాదు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ‘జబర్దస్త్’ కమెడియన్స్ బాగా పాపులారిటీ సంపాదిస్తున్నారు.  అయితే  ఈ మద్య ‘జబర్ధస్త్’ కామెడీ షో బాగా డబల్ మీనింగ్ మాటలు వస్తున్నాయని రూమర్లు వస్తున్నాయి. వీటిపై ఇప్పటికే ఎన్నో ఆక్షేపణలు..ఫిర్యాదులు వస్తున్నాయి.  

కొన్ని సార్లు నటులపై దాడులు కూడా జరిగాయి.  కొన్ని స్కిట్ లు తమ మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయని కాంప్లెంట్ చేస్తున్నారు.  రీసెంట్ గా ‘జబర్ధస్త్’ కామెడీ షో హైక్ పెంచడానికి జిమ్మిక్కులు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.  ఏప్రిల్ 1 సందర్భంగా సుడిగాలి సుధీర్, శ్రీను పై నాగబాబు, రోజా ఫైర్ అయినట్లు చూపించారు.  

తర్వాత ఇది అంతా ఫేక్ అని తేలింది..తాజాగా సునామి సుధాకర్ పై నాగబాబు ఫైర్ కావడమే కాదు..చెంప పగుల గొట్టి, కాలితో తన్నాడు.  ఇప్పుడు ఈ వీడియో కాస్త వైరల్ అయ్యింది. అయితే నిజంగా సుధాకర్ అర్హతకు మించి కాస్త బిల్డప్ ఎక్కువ ఇచ్చాడా..దీంతో నాగబాబుకు నిజంగానే చిర్రెత్తుకొచ్చిందా అని అందరూ అనుకుంటున్నారు.  ఏది ఏమైనా సుధాకర్ ని నాగబాబు కొట్టడం..తన్నడం చూస్తుంటే ఈ షో రోజు రోజుకీ ఎంత దిగజారి పోతుందో అర్థమవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: