బాహుబలి సినిమా తెలుగు సినిమా స్టామినాను ప్రూవ్ చేయడమే కాదు భారీ బడ్జెట్ సినిమాలకు ఓ మార్గాన్ని సుగుమం చేసింది. కలక్షన్ల డెప్త్ ను తెలియచేస్తూ వసూళ్ల హవా కొనసాగిస్తున్న బాహుబలిని క్రాస్ చేసే సినిమా ఇప్పుడప్పుడే వస్తుందా అన్న ఆలోచన రావడం ఖాయం. కాని తమిళ హింది పరిశ్రమలు బాహుబలిని తలదన్నే సినిమా రంగం చేసే క్రమంలో సినిమాలు చేస్తున్నారు.


కోలీవుడ్ లో క్రేజీ మూవీగా రాబోతున్న సినిమా సంఘమిత్ర. సముద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో జయం రవి, ఆర్యలు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇక రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. విజువల్ ఫీస్ట్ అందించేందుకు సంఘమిత్ర రెడీ అన్నట్టు పోస్టర్ చూస్తే కనబడుతుంది.


శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన రెండు ఫస్ట్ లుక్స్ అదిరిపోయాయి. అయితే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కేవలం గ్రాండియర్ గా కనిపిస్తున్నాయి కాని సినిమా బాహుబలి రేంజ్ లో వస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా బాహుబలి రికార్డులను టార్గెట్ చేస్తుండటం విశేషం. 


బాహుబలికి పనిచేసిన సబు సిరిల్ ఈ సినిమాకు పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే అంచనాలకు తగ్గట్టుగానే ఉంది మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మొదట ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్, ఇళయదళపతి విజయ్ లతో తీయాలని ఆలోచించారు దర్శకుడు సముద్ర కాని వారిరువురు కాదనడంతో జయం రవి, ఆర్యలతో తీస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: