బాలీవుడ్ లో ఒక సినిమాలో కాంబినేషన్ కుదిరితే చాలు ఇక వారి ఆన్ స్క్రీన్ లవ్ రొమాన్స్ వగైరా అంతా ఆఫ్ స్క్రీన్ లో కూడా చూపిస్తుంటారు. ఈ క్రమంలో ఎన్నో బాలీవుడ్ జంటలు తమ రిలేషన్ ను మెయింటైన్ చేయడం.. కాదు కుదరదు అన్నప్పుడు ఇద్దరు విడిపోవడం అంతా జరుగుతుంది.


స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ నుండి సిద్ధార్థ్ మల్హోత్రా, అలియా భట్ ఇద్దరు చాలా క్లోజ్ గా మూవ్ అవడం చూసి వీళ్లది ప్రేమే అని ఫిక్స్ చేసింది ముంబై మీడియా. ఎక్కడ కనబడ్డా కలిసి ఉండటంతో ఇద్దరి ప్రేమ వార్తలు జోరందుకున్నాయి. డైరెక్ట్ గా అడిగినా సరే డొంకతిరుగుడు సమాధానాలు చెబుతూ తప్పించుకున్నారు. ఇక ఇద్దరి ఎఫైర్ ఓ రేంజ్ లో ఉంది అనుకుంటున్న టైంలో ఇప్పుడు ఎవరికి వారు సైలెంట్ అయ్యారని తెలుస్తుంది.


ఇద్దరి మధ్య ఏవో చిన్న డిస్టబెన్సెస్ వచ్చాయట. అందుకే రీసెంట్ గా కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీలో సిద్ధార్థ్ తో కనీసం మాట కూడా మాట్లాడలేదట అలియా భట్. ప్రస్తుతం కెరియర్ మీద కాన్సెంట్రేట్ చేసిన ఈ భామ ఓ సౌత్ సినిమాను ఓకే చెప్పాలని చూస్తుందట. అది ఎందుకు అంటే సిద్ధార్థ్ తో టచ్ లో లేకుండా సౌత్ సినిమా అయితే లొకేషన్ చేంజ్ అవుతుదని ఆమె ఆలోచనట.


మరి ఏది ఏమైనా ఓ రేంజ్లో చెట్టాపట్టాలేసుకు తిరిగిన ఈ జంట మళ్లీ ఎవరికి వారు విడిగా ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బాలీవుడ్ లో ఇలా తిరగడం ఆ తర్వాత లైట్ తీసుకోవడం కామనే మరి సిద్ధార్థ్, అలియాలు కూడా లైట్ తీసుకుంటారో లేక మళ్లీ లైన్ లోకి వస్తారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: