అక్కినేని నాగార్జున తనయులు నాగ చైతన్య, అఖిల్ లను స్టార్స్ గా నిలబెట్టేందుకు నాగార్జున తెగ పాట్లు పడుతున్నాడు. చైతు కెరియర్ హిట్ ఫ్లాపులతో సాగుతున్నా కరెక్ట్ ఇమేజ్ మాత్రం సెట్ అవలేదు. అందుకే సంవత్సరం క్రితం నుండి తనయుల కెరియర్ మీదే కాన్సెంట్రేట్ చేశాడు నాగర్జున.


ఇక నిన్న జరిగిన రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో రిలీజ్ ఈవెంట్ లో 'అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం' అన్న డైలాగ్ ను 'నేనొప్పుకోను' అంటూ సరదా సంభాషణతో మొదలైన నాగ్ స్పీచ్ అక్కినేని ఫ్యాన్స్ ను ఇలా చూసి చాలా రోజులైంది వారిని కలిసేందుకే ఈ వేడుక ఏర్పాటు చేశామని అన్నారు.


అంతేకాదు సంవత్సరం క్రితం తాను తనయులతో రెండు బ్లాక్ బస్టర్స్ ఇస్తానని ఫ్యాన్స్ కు చెప్పానని.. అందులో ఇది మొదటి బ్లాక్ బస్టర్ మూవీ అని అన్నాడు నాగ్. ఇక రెండోది అఖిల్ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉందని అన్నారు. సో ఈ లెక్కన చూస్తుంటే నాగార్జున రారండోయ్ వేడుక చూద్దాం కచ్చితంగా చైతుకి ఓ బ్లాక్ బస్టర్ ఇస్తుందని నమ్మకంతో ఉన్నాడు.  


ఇక దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కథలో క్యారక్టరైజేషన్స్ బాగా డిజైన్ చేస్తారని తనకు బంగార్రాజులా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కు భ్రమరాంబ క్యారక్టర్ ఇచ్చాడు. ఆ పాత్ర చాలా బాగా వచ్చిందని అన్నారు. సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన దేవి ప్రస్తుతం ఫారిన్ లో ఉండి రాలేకపోయాడు. సినిమా సక్సెస్ అవడానికి దేవి మ్యూజిక్ కూడా ఓ కారణమవుతుందని నాగ్ వెళ్లడించారు.      


మరింత సమాచారం తెలుసుకోండి: