బుల్లితెర యాంకర్ గా ప్రస్తుతం టాప్ రేంజ్ లో పరుగులు తీస్తున్న అనసూయ నేటితరం బుల్లితెర ప్రేక్షకులకు ఎప్పుడు ఒక హాట్ న్యూస్. న్యూస్ రీడర్‌ గా బుల్లితెర పై తన కెరియర్ ను ప్రారంభించిన అనసూయ ఆ తరువాత తన కెరియర్ లో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కుని ‘జబర్దస్త్‌’ తో బుల్లితెర సేలేబ్రెటీగా మారిపోయింది. 

హాట్ లుక్స్ తో యూత్ ను ఆకర్షించే ఈమె ఇద్దరు పిల్లల తల్లి అంటే చాలామంది నమ్మరు. ఈమె వచ్చినన్ని గాసిప్పులు ఇప్పటి వరకు ఏ టెలివిజన్ సెలెబ్రెటీ పైనారాలేదు. ఇలాంటి మ్యాడ్ క్రేజ్ ఉన్న ఈ బ్యూటీ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసింది. 

గ్లామర్ ఫీల్డులో డబ్బుతో పాటు పేరు కూడ బాగా వస్తుంది అన్న ఉద్దేశ్యంతో తాను ఈ ఫీల్డ్ కు వచ్చాను అని చెపుతూ ఒక అందమైన ఇంటిని కట్టుకుని ఆ ఇంటిలో స్వయంగా పెంచుకొన్న కూరగాయలతో వంటచేసుకొవాలనేది తన కోరిక అని అంటోంది అనసూయ. ఇదే సందర్భంలో తన కుటుంబ నేపధ్యం గురించి అనసూయ వివరిస్తూ అనేక షాకింగ్ విషయాలను బయట పెట్టింది. 

తన సొంత ఊరు నల్గొండ జిల్లాలోని భూదాన్‌ పోచంపల్లి అని చెపుతూ తన తాత సుందర్‌ రావు భూదాన్‌ పోచంపల్లి సర్పంచ్‌గా పనిచేసిన విషయాన్ని గుర్తుకు చేసుకుంది. అంతేకాదు తమ ఊరిలో 101 దర్వాజల ఇల్లు తమదే అని అంటూ ఆచార్య వినోబాభావే పిలుపుతో తమ తాత ఆస్తులన్నీ ఇచ్చేశాడు అంటూ అప్పటి విషయాలను గుర్తుకు చేసుకుంది అనసూయ. 

అదేవిధంగా తన తండ్రి రాజకీయ నాయకుడు కావడంతో తన ఇల్లు అంతా ఎప్పుడూ పార్టీ కార్యకర్తలతో సందడిగా ఉండే విషయాన్ని కూడ బయట పెట్టింది అనసూయ. తాను ఎంతగానో ఇష్టపడే వెండితెర మన్మధుడు నాగార్జున మరదలుగా ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాలో నటించడం తన అదృష్టం అని అంటూ సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్‌’ చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌ చేయడానికి గల కారణం ‘సూయ సూయ, అనసూయ' అనే పాట తనకు నచ్చడం అని అంటోంది. ఎప్పుడు ఎదో ఒక విషయమై సంచలన వార్తలలో ఉండటానికి ప్రయత్నించే అనసూయ హవా మరి కొన్ని సంవత్సరాలు కొనసాగుతుంది అని అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు..   



మరింత సమాచారం తెలుసుకోండి: