యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవ కుశ సినిమా పూర్తి చేశాక కొరటాల శివతో సినిమా ఫిక్స్ చేశాడు. ఆ సినిమాకు ముందే త్రివిక్రం తో సినిమా ఉంటుందని అనుకున్నా అది ఎందుకో పట్టాలెక్కలేదు. బాబి తర్వాత త్రివిక్రం సినిమా చేస్తాడన్న వార్తలకు షాక్ ఇస్తూ కొరటాల శివతో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు ఎన్టీఆర్.  


అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే కొరటాల శివ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ కచ్చితంగా త్రివిక్రంతో సినిమా చేస్తాడట. అది కూడా ఓ పిలిటికల్ థ్రిల్లర్ కథతో వచ్చే అవకాశాలు ఉన్నాయట. జై లవకుశలో త్రిపాత్రాభినయం చేస్తున్న తారక్ కొరటాల శివ సినిమాలో మరో సోషల్ మెసేజ్ తో వస్తున్నాడట. ఇక ఆ తర్వాత త్రివిక్రం తో మాత్రం ఓ పొలిటికల్ థ్రిల్లర్ కథ అనుకున్నాడట.   


2019 ఎలక్షన్స్ టార్గెట్ తోనే ఈ కథ ఉండబోతుందని టాక్. ఇప్పటికే త్రివిక్రం రాసిన లైన్ జూనియర్ కు వినిపించగా ఓకే చేశాడట. ఒకప్పుడు టిడిపి తరపున విసృతంగా ప్రచారం చేసిన తారక్ ఇప్పుడు కాస్త దూరంగా ఉంటున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా 2019 ఎన్నికల మీద ప్రభావితం చేసే అవకాశం ఉంది.  


హీరోల్లో ఎవరు పొలిటికల్ థ్రిల్లర్ కథలు చేసినా అంతగా పట్టించుకోరేమో కాని ఎన్.టి.ఆర్ చేస్తే మాత్రం కచ్చితంగా దానికో స్పెషాలిటీ ఉండే అవకాశం ఉంటుంది. త్రివిక్రం లాంటి క్రేజీ డైరక్టర్ రాసిన కథ కాబట్టి కచ్చితంగా అది ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఎన్.టి.ఆర్ మైలేజ్ పెంచే సినిమా అవుతుందని అంటున్నారు. మరి ఈ సినిమా గురించి మరిన్ని డీటేల్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: