మర్ ఇండస్ర్టీలో జూనియర్ ఐశ్వర్యగా పేరు సంపాదించుకున్న స్నేహా‌ఉల్లాల్ తెలుగు, హిందీ ఇండస్ట్రీలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.  అయితే ఈ అమ్మడు గ్లామర్ పరంగా బాగానే ఆకట్టుకున్నా సినిమాలు మాత్రం పెద్దగా విజయవంతం కాలేదు.   ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీతో గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ.. ఆ తర్వాత సింహ లాంటి బ్లాక్ బస్టర్ లో కూడా నటించింది. తెలుగులో చెప్పుకోదగిన సంఖ్యలోనే సినిమాలు చేసిన స్నేహా ఉల్లాల్.. మూడేళ్లుగా సినిమాలకు దూరమైపోయింది.

సాధారణంగా సినిమాలకు దూరమైన హీరోయిన్లపై రూమర్లు రావడం సహజమే..అయితే ఈ అమ్మడిపై కూడా రక రకాల రూమర్లు వచ్చాయి.  దీనిపై స్పందించిన స్నేహా ఉల్లాల్ ఇందుకు తనకు గల ఒక వ్యాధి కారణం అని చెప్పింది స్నేహా ఉల్లాల్. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నపుడు బ్రేక్ తీసుకోవాలని తాను అనుకోలేదని.. అయితే తన వ్యాధి కారణంగా ఇలా గ్యాప్ ఇవ్వక తప్పలేదని చెప్పింది స్నేహా ఉల్లాల్. ‘రక్తానికి సంబంధించిన ఒక వ్యాధితో బాధ పడ్డాను. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కారణంగా నేను మరీ బలహీనంగా మారిపోయాను.
Image result for sneha ullal
నా అంతట నేను కనీసం 30 నిమిషాల పాటు కూడా నిలబడలేకపోయేదాన్ని. దీంతో 2014 వరకు నాకు ఉన్న కమిట్మెట్స్ ను పూర్తి చేసేసి గ్యాప్ తీసుకున్నాను.  ప్రస్తుతం చరణ్‌తేజ్ డైరెక్షన్‌లో ‘ఆయుష్మాన్ భవ’ మూవీ చేస్తోంది. 2005లో సల్మాన్‌ఖాన్‌ ‘లక్కీ’ సినిమాతో గ్లామర్ ఇండస్ర్టీకి పరిచయమైంది స్నేహాఉల్లాల్.  అక్కడ ఆఫర్లు తగ్గుముఖం పట్టడంతో టాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టింది. చివరిగా 2014లో ‘అంతా నీ మాయలోనే’ చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: