తెలుగు ఇండస్ట్రీలో ఆ మద్య మంచు విష్ణు సరసన నటించిన అందాల భామ సెలీనా జైట్లీ తర్వాత బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది.  ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్న ఈ భామ ఇప్పటికే మొదటి కాన్పు లో కవల పిల్లలు పుట్టగా తాజాగా మరోసారి కవల పిల్లలకు జన్మ నివ్వబోతోంది.  బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించిన ఈ అమ్మడు మాత్రం పెద్దగా సక్సెస్ సాధించలేక పోయింది.
Image result for సెలీనా జైట్లీ
 తెలుగులో సూర్యం చిత్రంలో నటించిన సెలీనా ఆ సినిమా పెద్దగా ఆలరించ లేక పోయింది. గ్లామర్ పరంగా సెలీనా తన అంద చందాలతో అప్పట్లో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టించింది.  ఈ అమ్మడు 2011 లో  పీటర్ హాగ్  ని పెళ్లి చేసుకుంది.  కాగా పెళ్లి అయిన వెంటనే తల్లి కావడం..మొదటి కాన్పులోనే కవలలు పుట్టడంతో తెగ సంతోషంలో మునిగి పోయారు.  
Image result for సెలీనా జైట్లీ
ఈ మద్య సెలీనా మరోసారి ప్రెగ్నెన్సీ కావడంతో ఆసుపత్రి కి చెకప్ కోసం వెళితే మళ్ళీ కవల పిల్లలు పుట్టబోతున్నారు అంటూ డాక్టర్ చెప్పడంతో షాక్ అయ్యారట . మళ్ళీ కవలలు వస్తుండటంతో సెలీనా జైట్లీ దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు. వారికి విన్ స్టర్, విరాజ్ అని పేర్లు పెట్టింది. ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న సెలీనా త్వరలో ఓ యాడ్ షూట్ నిమిత్తం ఇండియా రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: