ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో కొత్త సినిమాల హవా కొనసాగుతుంది. మంచి కథ..మ్యూజికల్ హిట్ అయితే సినిమా హిట్ టాక్ రావడమే కాదు కలెక్షన్లు కూడా బాగా వస్తున్నాయి.  ముఖ్యంగా కొత్త నటీనటులు సినిమాల్లో రావడం కూడా కొత్త సందడి మొదలైంది.  తాజాగా గ్రాయత్రి ప్రొడక్షన్స్ పతాకం పై కె.ఎస్.రావు నిర్మాణ సారథ్యంలో నూతన దర్శకుడు నరేశ్ పెంట తెరకెక్కించిన సినిమా 'శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట'.  ఈ చిత్రంలో  నూతన తారలు శేఖర్ వర్మ, దీప్తి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు.  
Image result
మే 26న ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో హీరోయిన్ దీప్తి తాజాగా పాత్రికేయులతో ముచ్చటించారు.  ఇండస్ట్రీకి కొత్త అయినా దర్శకులు మాచే మంచి నటన రాబట్టారని ప్రిమియర్ చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి పాజిటివ్ గా స్పందిచడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.  ఈ సినిమా చూసినంత సేపు పల్లెల్లో తిరిగిన అనుభవం ప్రేక్షకులకి తప్పక వస్తుందని చెప్పారు దీప్తి.
Image result
అలానే ఈ సినిమాతో ఓ పల్లెటూరు అమ్మాయిలా కనిపించబోతున్నానని, స్వతహాగ కన్నడ అయినప్పటికీ స్వచ్ఛమైన తెలుగమ్మాయిలా నటించడం చాలా ఆనందాన్నిచ్చందని చెప్పారు. ఇక షూటింగ్ సమయంలో హీరో శేఖర్ దగ్గర తెలుగు భాష నేర్చుకున్నానని ఇప్పుడు తెలుగు బాగానే మాట్లాడుతున్నట్లుగా తెలిపారు.

'శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట' వంటి కుటుంబ కథా చిత్రంతో జరగడం తన కెరీర్ కి చాలా హెల్ప్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు దీప్తి. ఈ సినిమా తన క్యారెక్టర్ ప్రేక్షకుల్ని తప్పక అలరిస్తుందని, మే 26న విడుదల కాబోతున్న ఈ సినిమాను చూడాల్సిందిగా  దీప్తి కోరారు. ఈ చిత్రానికి రచన-సంగీతం-దర్శకత్వం నరేశ్ పెంట. నిర్మాత : కే.యస్.రావు, సినిమాటోగ్రఫి : కూనపరెడ్డి జయకృష్ణ, నిర్మాణ నిర్వహణ : కే.ఆర్. ప్రశాంత్.



మరింత సమాచారం తెలుసుకోండి: