నందమూరి కళ్యాణ్ రాం ప్రస్తుతం తానా సభలకు అతిధిగా వెళ్లారు.. వేరే వాళ్లలా కాకుండా ఈ ప్రయాణానికి అయ్యే ఖర్చు తన సొంతంగా పెట్టుకుంటానని అందరికి షాక్ ఇచ్చారు. ఇక అక్కడ అభిమానులు తెలుగు సంఘాలు పలికిన ఆహ్వానం చూసి సంతోషించిన కళ్యాణ్ రాం తన స్పీచ్ తో కూడా అదరగొట్టారు. ఎన్.టి.ఆర్ అవార్డ్ అందుకున్న కళ్యాణ్ రాం మాట్లాడుతూ అభిమానుల్లో హుశారు నింపారు.


ఇక తాను మాట్లాడుతున్న సమయంలో జూనియర్ ఎన్.టి.ఆర్ ప్రస్థానవ రాగా ఫ్యాన్స్ ఎన్.టి.ఆర్ లెజెండ్ అని అరవడం మొదలుపెట్టారు. వారిని ఆపమన్నా సరే ఆపకపోయే సరికి తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే అసలైన లెజెండ్ అని. తమ్ముడు లెజెండ్ కాదని అనేశాడు. తమ్ముడిని అలా పిలవద్దని కూడా అన్నాడట. ఎన్.టి.ఆర్ ఓ ఆటం బాంబ్ అని సంభోదించారు కళ్యాణ్ రాం.  


ప్రస్తుతం ఎన్.టి.ఆర్ నటిస్తున్న జై లవకుశ నిర్మిస్తున్న కళ్యాణ్ రాం సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నట్టు కనబడుతుంది. రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా అంచనాలు పెంచేయడంతో చిత్రయూనిట్ మరింత జాగ్రత్తగా సినిమా అవుట్ పుట్ కోసం కష్టపడుతున్నారు. తానా సభల్లో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి కూడా ఫ్యాన్స్ అడుగగా అది బాబాయ్ చెబితేనే బాగుంటుందని అన్నారు కళ్యాణ్ రాం.


ఇక తన ప్రొడక్షన్ లో బాబాయ్ హీరోగా సినిమా తప్పకుండా ఉంటుందని సరైన కథ దొరికితే తప్పకుండా చేస్తామని అన్నారు. సినిమా హిట్ ఫ్లాపుల కన్నా మనసుకి నచ్చితే చేస్తానని.. అలా నచ్చకపోతే సినిమాలు తీయకుండా ఖాళీగా ఉంటానని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: