టాలీవుడ్ లో ఈమధ్య యువ హీరోల మధ్య సాన్నిహిత్యం బాగా ఉంది. ఒకరి సినిమాకు మరొకరు సహాయం చేయడమే కాదు అందరు కలిసి సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ సూపర్ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతుంది. నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది నలుగురు హీరోలు కలిసి నటిస్తున్న సినిమా శమంతకమణి.


భలే మంచి రోజు డైరక్టర్ శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్లో వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. కుర్ర హీరోల మల్టీస్టారర్ రేంజ్ ఏంటో చూపించింది ఈ పోస్టర్. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఏ హీరోని రివీల్ చేయకుండా కేవలం వారి వాయిస్ లతో పోస్టర్ వదిలారు.


ఓ పాత కాలం కారుని చూపిస్తూ టైటిల్ వదిలిన డైరక్టర్ కచ్చితంగా ఓ మంచి కథ ఎంచుకున్నాడనే అనిపిస్తుంది. సినిమాలో నలుగురు హీరోలకు చాలా ఇంపార్టెంట్ రోల్స్ అని తెలుస్తుంది. భలే మంచి రోజు తర్వాత గ్యాప్ తీసుకున్న శ్రీరాం ఆదిత్య శమంతకమణితో ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చాడు. పోస్టర్ మాత్రం అందరిని ఇంప్రెస్ చేసింది.


ఇద్దరి హీరోలను ఒప్పించడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో ఏకంగా నలుగురు హీరోలతో సినిమా చేయడం గొప్ప విషయమే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టైటిల్ పోస్టర్ వైరల్ గా వెళ్తుంది. కారుని ఫస్ట్ లుక్ లో చూపించారు అంటే దాని చుట్టూనే కథ తిరుగుతుందనే అంటున్నారు. ఏది ఏమైనా డైరక్టర్ శ్రీరాం ఆదిత్య స్టఫ్ ఏంటో ఈ సినిమాతో తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: