మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైది నంబర్ 150 సినిమాను డైరెక్ట్ చేసిన వివి.వినాయక్ తన తర్వాత సినిమా ఇప్పటిదాకా ఎనౌన్స్ చేయలేదు. ఓ పక్క చిరు 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పట్టాలెక్కబోతుంటే వినాయక్ తో సినిమా చేసేందుకు స్టార్స్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. 


తెలుస్తున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ తర్వాత వినాయక్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడట సుప్రీం హీరో సాయి ధరం తేజ్. రీసెంట్ గా విన్నర్ తో మెగా ఫ్యాన్స్ ను పలుకరించిన తేజ్ ప్రస్తుతం జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక అదే కాకుండా శతమానం భవతి డైరక్టర్ సతీష్ వేగేశ్న డైరక్షన్ లో శ్రీనివాస కళ్యాణం సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేశాడు సాయి ధరం తేజ్.


ఇక ఈ రెండు కాకుండా వినాయక్ తో సినిమాకు సంప్రదింపులు జరుపుతున్నారట. తేజ్ కు ఆల్రెడీ లైన్ వినిపించి ఓకే చేయగా దాన్ని డెవెలప్ చేసే పనిలో ఉన్నారట వినాయక్ అండ్ టీం. ఖైదితో హిట్ కొట్టినా అది కేవలం చిరు క్రేజ్ తోనే నడిచిందనే భావన ఉంది. అందుకే మెగా మేనళ్లుడితో మెమరబుల్ హిట్ కొట్టి తన సత్తా ఏంటో చూపించాలని చూస్తున్నాడు వినాయక్. 


ఇక మొన్నటిదాకా కొత్త వారితో యావరేజ్ డైరక్టర్స్ తో సినిమాలు తీసిన తేజ్ మొదటిసారి స్టార్ రేంజ్ డైరక్టర్ తో తీస్తుండటం మెగా ఫ్యాన్స్ కు ఖుషి ఇస్తుంది. మరి ఈ సినిమా నిర్మాత ఎవరు ఏ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అన్నది తెలుసుకోవాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: