తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య అగ్ర హీరోల సినిమాలు ఒకే సారి రిలీజ్ కావడంతో అభిమానులకు ఒకింత క్రేజ్ గా ఉన్నా..మరోవైపు కలెక్షన్ల పరంగా టెన్షన్ వాతావరణం నెలకొంటుంది.  ఈ సంవత్సరం తెలుగు ఇండస్ట్రీ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’, నటసింహం బాలకృష్ణ నటించిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ ఒక్కరోజు గ్యాప్ తో రిలీజ్ అయ్యాయి.  అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి కలెక్షన్లు కూడా బాగా రాబట్టాయి.  గత సంవత్సరం కూడా ఒకేసారి బాలకృష్ణ, నాగార్జున, ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి.  సినిమాలు బాగా హిట్ అయితే ఓకే కానీ ఏ మాత్రం బ్యాడ్ టాక్ వచ్చినా కలెక్షన్లపై భారీగానే దెబ్బ పడుతుంది.
Image result for mahesh spider
గత రెండు మూడు నెలల నుంచి ‘బాహుబలి 2’ మానియా మొదలైన విషయం తెలిసిందే.  ఇప్పటికే ఈ సినిమా 1600 కోట్లుకు పైగా కలెక్షన్లు రాబట్టింది.  ఈ సినిమా దాటికి ఏ సినిమాలు నిలవలేక పోవడం మరో విషయం. కాకపోతే తెలుగులో చిన్న సినిమాలు వస్తూ పోతు ఉన్నాయి. ఇప్పుడు అగ్ర హీరోలు మహేష్ బాబు , ఎన్టీఆర్ లు బాక్సాఫీస్ వద్ద యుద్ధం జరిగేలా అనిపిస్తుంది.   ఈ ఇద్దరూ నటిస్తున్న  చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి . మహేష్ బాబు మురుగదాస్ దర్శకత్వంలో '' స్పైడర్ '' చిత్రం చేస్తుండగా ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో '' జై లవకుశ '' చిత్రం చేస్తున్నాడు .
Image result for jai lava kusa
ఈ రెండు కూడా సెప్టెంబర్ 1న విడుదల కానున్నట్లు తెలుస్తోంది . ఇదే జరిగితే మాత్ర ఇద్దరు హీరోల మద్య యుద్దం తప్పకుండా జరుగుతుంది. ఇప్పటికే ఎన్టీఆర్ వరుస హిట్స్ తో దూసుకు వెళ్తుంటే..మహేష్ మాత్రం ‘శ్రీమంతుడు’ తర్వాత ‘బ్రహ్మోత్సవం’ తో భారీ అపజాయాన్ని పొందాడు. అంతే కాదు ‘స్పైడర్’ కోసం చాలా సమయం వెచ్చించారు.  

స్పైడర్ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ సకాలంలో షూటింగ్ జరగకపోవడం వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతోంది . అయితే ఎట్టకేలకు సెప్టెంబర్ రిలీజ్ అని అన్నారు . . గత ఏడాది సెప్టెంబర్ 1న జనతా గ్యారేజ్ రిలీజ్ అయి పెద్ద హిట్ అయ్యింది దాంతో సెంటిమెంట్ గా జై లవకుశ చిత్రాన్ని సెప్టెంబర్ 1న రిలీజ్ చేయాలనుకుంటున్నారు . మరి ఈ రెండు సినిమాలు పోటీ పడితే ఎలా ఉంటుందో చూడాలి . 


మరింత సమాచారం తెలుసుకోండి: