తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు పది సంవత్సరాల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో  మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు.  ఈ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేసి 150 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.  ప్రస్తుతం సురెందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి స్వతంత్ర పోరాట యోధుడు ‘ఉయ్యాల‌వాడ న‌ర్సింహారెడ్డి ’ చిత్రంలో నటిస్తున్నారు.  అయితే గత కొంత కాలంగా మెగా బ్రదర్స్  ఒకే సినిమాలు కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తూ వస్తుంది.  మెగాస్టార్ - ప‌వ‌ర్ స్టార్ - త్రివిక్రమ్  కాంబినేష‌న్లో  టి.సుబ్బిరామిరెడ్డి భారీ చిత్రానికి శుభగడియలు వస్తున్నాయని అంటున్నారు.  
Image result for ఉయ్యాల వాడ నర్సింహారెడ్డి
గతంలో మెగాస్టార్ నటించిన సినిమాలో పవన్ క్లయిమాక్స్ లో కనిపిస్తాడు.  తాజాగా ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించబోయే చిత్రం సెన్సేషన్ హిట్ అంటున్నారు మెగా ఫ్యాన్స్.   మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్లో సినిమా వ‌స్తే చూడాల‌నివుంది అని ఎప్ప‌టి నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Image result for mega brothers
ఈ భారీ మ‌ల్టీ స్టార‌ర్ మూవీని క‌ళా బంధు టి. సుబ్బిరామిరెడ్డి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌నున్నారు. ఈ భారీ చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారన్న విషయం విదితమే. పవన్ 25వ చిత్రంగా చెప్పుకుంటున్న దీని తర్వాత సినిమాలకు పుల్ స్టాప్ పెట్టి పూర్తిగా రాజకీయాల వైపు దృష్టిసారించనున్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
Related image
అయితే దీని తర్వాత ఫ్యాన్స్ కు అసలైన మజా అందించబోతున్నాడని టాక్.  టీఎస్సార్ పవన్ సెట్స్ కి వెళ్లటం.. అక్కడ త్రివిక్రమ్ తో కొత్త సినిమా కథ డిస్కషన్ కూడా జరిగిపోయిందని తెలుస్తోంది.  దీంతో.. మెగా మూవీ సినిమా పనులు మొదలయ్యాయనే సంకేతాలు అందుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: