ప్రస్తుతం కాలంలో సినిమా, క్రీడా రంగానికి ఎంతో ప్రాధాన్య ఇస్తున్నారు అభిమానులు.   ముఖ్యంగా క్రికెట్, టెన్నిస్, ఫుట్ బాల్, హాకీ ఇలాంటి క్రీడలు అంటే భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది.  ఇందులో మంచి ప్రతిభ చూపించిన వారు గొప్ప సెలబ్రెటీలు అవుతున్నారు.  ఇక సినిమా ఇండస్ట్రీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా సినిమా, క్రీడా రంగానికి చెందిన అక్షయ్ కుమార్, టెన్నిస్ స్టార్ సైనా నెహ్వాల్ కి మావోలు సీరియస్ వార్నింగ్ ఇచ్చారట.
Image result for mavos worning attack crpf
 అసలు విషయానికి వస్తే..మార్చిలో న‌క్స‌ల్స్ దాడిలో చ‌నిపోయిన సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక ఈ ఇద్దరు ముందుకు వచ్చారు.  ఇక సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక స‌హాయం చేయ‌డాన్ని మావోలు ఖండించారు.  సెల‌బ్రిటీల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తూ విడుద‌ల చేసిన లేఖ ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రం బ‌స్త‌ర్‌లో దొరికింది. అన్యాయానికి గుర‌వుతున్న గిరిజ‌నుల వైపు నిల‌వాల్సింది పోయి వారి హ‌క్కుల‌ను కాల‌రాస్తున్నవారికి మ‌ద్ద‌తు తెల‌ప‌డం స‌రికాద‌ని సెల‌బ్రిటీల‌కు దేశంలోని ప్ర‌ముఖుల‌కు ఈ లేఖ ద్వారా హెచ్చ‌రించింది.
Image result for mavos worning attack crpf
కార్పోరేటర్లకు పెద్ద పీట వేస్తున్న పోలీసులు..మన్యంలో ఉంటున్నవారి మాన ప్రాణాలతో ఆడుకుంటున్నారని వారిని అందుకే చంపుతున్నామని వారు వాదిస్తున్నారు.  అలాంటి వారి వెన‌కాల నిల‌బ‌డిన అక్ష‌య్ కుమార్‌, బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మ‌ద్ద‌తు తెల‌ప‌డం దారుణ‌మ‌న్నారు. సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు దేశం కోసం మ‌ర‌ణించ‌లేద‌న్న విషయాన్ని గుర్తించుకోవాలని ఘాటుగా యాక్టర్లపై విరుచుకుపడ్డారు.  అంతే కాదు  స్థానికులు, గిరిజ‌నుల‌ను అణిచివేస్తున్నందుకే జ‌వాన్లపై దాడి చేసి చంపామ‌ని న‌క్స‌లైట్లు లేఖ‌లో పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: