తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్.  డ్యాన్స్, ఫైట్స్ లో తనకంటూ ప్రత్యేక స్టైల్ క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ గత సంవత్సరా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు.  కాస్త గ్యాప్ తీసుకున్న బన్ని‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన హరిష్ శంకర్ దర్శకత్వంలో  ‘డీజే-దువ్వాడ జగన్నాథమ్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఒక్కోసాంగ్ రిలీజ్ చేస్తుండగా తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేశారు.  

రీసెంట్‌గా అబుదాబిలో షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్ర బృందం ఇప్పుడు హైద‌రాబాద్‌‌లో ఓ పాటను చిత్రీకరిస్తోంది. సాహిత్య రచయిత శ్రీమ‌ణి రాసిన పాట‌ను దినేష్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో సాంగ్‌ పిక్చ‌రైజ్ చేస్తున్నారు. రీసెంట్ గా    డీజే శ‌ర‌ణం భ‌జే భ‌జే అనే సాంగ్ విడుద‌ల కాగా, ఈ సాంగ్ కి భారీ రెస్పాన్స్ వ‌స్తుంది. నిమిషాల‌లో వందల కొద్ది లైక్స్ ఈ సాంగ్ కి వ‌స్తున్నాయి.  ‘గుడిలో బడిలో మదిలో..ఒడిలో’ అనే పాట మ్యూజిక్, డ్యాన్స్ అద్భుతంగా ఉంది.  బన్ని, పూజా హెగ్డె డ్యాన్స్ అదరగొట్టారు.

 గత కొంత కొన్ని రోజుల నుంచి   అభిమానులలో ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  ఆ అంచనాలకు తగ్గటు సాంగ్స్ ఉండటంతో బన్నీ అభిమానుల్లో ఆనందోత్సహాలు వెల్లువెత్తుతున్నాయి.  ఇక సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్‌:రామ్‌-లక్ష్మణ్‌, సినిమాటోగ్రఫీ: ఐనాక బోస్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటర్‌: ఛోటా కె.ప్ర‌సాద్, ఆర్ట్‌: రవీందర్‌, స్క్రీన్‌ప్లే: రమేష్ రెడ్డి, దీపక్‌ రాజ్‌, నిర్మాతలు: దిల్‌రాజు-శిరీష్‌, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్‌ శంకర్‌.ఎస్‌.



మరింత సమాచారం తెలుసుకోండి: