తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో ఎంతో మంది యంగ్ హీరోలు ఎంట్రీ ఇస్తున్నారు...ఇచ్చారు. అయితే ఎవరూ ఎవరికి పోటీ కాకుండా ఎవరి టాలెంట్ వారు ఇండస్ట్రీలో నిరూపించుకుంటూ తమ సత్తా చాటుతున్నారు. మెగా బ్రదర్స్ నాగబాబు ‘రాక్షసుడు’ చిత్రంతో ఎంట్రీ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు. ఇక మరో తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత గొప్ప ఇమేజ్ సంపాదించాడు. ప్రస్తుతం నటుడిగానే కాకుండా రాజకీయంగా కూడా ప్రజలకు చేరువయ్యారు.
ఇక బన్ని, రాంచరణ్ ఇప్పటికే స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మద్య ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ, వరుణ్ తేజ లు కూడా తమ సత్తా చాటుకుంటున్నారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో చిత్రాలు నిర్మించారు. అయితే మెగా తనయుడు రాంచరణ్ తో ‘ఆరెంజ్’ చిత్రంతో భారీగా నష్టపోయాడు. ఆ దెబ్బతో ఇండస్ట్రీలో చాలా కాలం వరకు నిర్మాణ రంగానికి దూరమయ్యారు. అయితే ఇప్పుడు మంచి సక్సెస్ బాటలో దూసుకు వెళ్తున్న అల్లు అర్జున్, తన తాజా చిత్రం “దువ్వాడ జగన్నాధమ్” సినిమా ముగిసిందో లేదో మరో సినిమాను మొదలు పెట్టేసాడు.
ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. అంతకుముందు హల్చల్ చేసిన “నా పేరు సూర్య” అన్న టైటిల్ నే ఖరారు చేస్తూ… దానికి “నా ఇల్లు ఇండియా” అన్న ట్యాగ్ లైన్ ను యాడ్ చేసారు. అయితే ఆరంజ్ చిత్రం తర్వాత నిర్మాణ రంగానికి దూరమైన నాగబాబు మళ్ళీ బన్నీ సినిమాతో ఆ దిశగా అడుగులు వేయడం విశేషం. అలాగే లగడపాటి శ్రీధర్, బన్నీ వ్యాస్ లు సంయుక్తంగా ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను చేపట్టనున్నారు.
నిజానికి ఈ సినిమాను తొలుత జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించడానికి వక్కంతం వంశీ సన్నాహాలు చేసుకుని, ఓ ఇంటర్వ్యూలో స్పష్టత కూడా ఇవ్వగా, చివరి నిముషంలో అది కాస్త బన్నీ సొంతమైంది. సహజంగా చేతులు మారిన సినిమాలు ఆయా హీరోల కెరీర్లో భారీ హిట్లు సాధించిన ట్రాక్ రికార్డ్ టాలీవుడ్ లో ఉంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే నిర్మాణ రంగంలో మళ్లీ కొనసాగేలా ఉన్నారు నాగబాబు.