ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులే కాకుండా పొలిటీషియన్ వారసులు కూడా హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు సోదరుడి తనయుడు నారా రోహిత్, మంత్రి గంటా శ్రీనివాస్ తనయుడు గంటా రవి ‘జయదేవ్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆ మద్య జాగ్వార్ చిత్రంతో మాజీ ప్రధాని దేవెగౌడ తనయుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
తాజాగా జాగ్వార్ నిర్మాత అయిన కుమారస్వామి అరెస్ట్ కు రంగం సిద్దం అయినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న కుమారస్వామి పలు అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపణలు వెల్లువెత్తాయి అయితే అది ఇన్నాళ్ళకు కుమారస్వామి మీదకు ముంచుకు వస్తున్నట్లు తెలుస్తోంది.
అంతే కాదు కుమార్ స్వామి బెయిల్ కోసం అప్లై చేసుకోగా బెయిల్ మంజూర్ కాలేదు దాంతో కుమారస్వామి అరెస్ట్ కావడం ఖాయమని అంటున్నారు. ఇక కర్ణాటకలో కుమార్ స్వామి బలం పెంచుకోవడంతో..ఆయనను ఎలాగైనా దెబ్బ తీయాలనే ఉద్దేశ్యంతో ప్రత్యర్థులు కుట్ర పన్నుతున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఇక తనయుడు తో జాగ్వార్ అనే ఫ్లాప్ సినిమాని నిర్మించిన సంగతి తెలిసిందే .