స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరిష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దువ్వాడ జగన్నాధం. సినిమాలో బ్రాహ్మణ యువకుడిగా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. సినిమా మొదలుపెట్టిన నాటి నుండి ఈ క్యారక్టర్ ను యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అదుర్స్ తో పోల్చుతూ కామెంట్లు చేస్తున్నారు. 


వి.వి.వినాయక్ డైరక్షన్ లో తారక్ నటించిన అదుర్స్ లో చారి పాత్ర బాగా హైలెట్ అయ్యింది. స్టార్ హీరోల్లో ఎలాంటి పాత్రనైన సరే అలవోకగా చేసే గట్స్ తనవే అని తారక్ ప్రూవ్ చేశాడు. మెగా హీరోల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న అల్లు అర్జున్ డిజెతో బ్రాహ్మిన్ గా దర్శనమిస్తున్నాడు.  


సినిమా టీజర్, ట్రైలర్ లో బన్ని డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. తాను ఇంత కష్టపడినా సరే మళ్లీ తారక్ అదుర్స్ లో పోల్చడం మింగుడుపడట్లేదు బన్నికి. అందుకే కొత్తగా ప్రమోషన్స్ ఆ క్లారిటీ ఇవ్వడలచాడట. తాను డైరెక్ట్ గా కాకున్నా దర్శకుడు హరిష్ శంకర్ తో అయినా సరే క్లారిటీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.


పూజా హెగ్దె హీరోయిన్ గా నటించిన డిజె మూవీని దిల్ రాజు నిర్మించారు. తన బ్యానర్లో వస్తున్న 25వ సినిమాగా డిజెని ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడు. సరైనోడుతో కెరియర్ బెస్ట్ హిట్ అందుకున్న బన్ని డిజెతో కూడా ఆ హిట్ మేనియా కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: