కింగ్ నాగార్జున ప్రస్తుతం తనయుల కెరియర్ ను బాగు చేసే పనిలో పడ్డాడు. ఆ క్రమంలో తన ప్రొడక్షన్ లో ఇన్నాళ్లు ఎప్పుడు లేని విధంగా భారీ బడ్జెట్ సినిమాలను చేస్తున్నాడు. నాగ చైతన్యను రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో హిట్ ఇచ్చిన నాగ్ ఆ తర్వాత మళ్లీ హిట్ కాంబో సెట్ చేస్తున్నాడు. 


రారండోయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నా నాగ్ అంత సాటిస్ఫై అవ్వలేదు. ఇక మరో పక్క అఖిల్ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. విక్రం కుమార్ కు బడ్జెట్ లిమిట్ లేకుండా సినిమా చేయమన్నట్టు తెలుస్తుంది. ఇక మరో పక్క నాగ చైతన్య కు బ్యాక్ టూ బ్యాక్ హిట్ పడేందుకు బోయపాటి శ్రీను లాంటి స్టార్ డైరక్టర్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట.


భద్ర నుండి సరైనోడు వరకు బోయపాటి హిట్ మేనియా తెలిసిందే.. మధ్యలో దమ్ము ఒక్కటి తప్పించి బోయపాటి సినిమాలన్ని సూపర్ హిట్ అందుకున్నవే. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో జయ జానకి నాయకా సినిమా చేస్తున్న బోయపాటితో చైతు సినిమా ఫిక్స్ చేస్తున్నాడట నాగార్జున. ఇందుకోసం బోయపాటికి 12 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఆఫర్ చేశాడట.


చూస్తుంటే తనయుల విషయంలో నాగ్ ఇంకాస్త జాగ్రత్త పెంచాడని అనిపిస్తుంది. ఓం నమో వెంకటేశాయ తర్వాత రాజు గారి గది-2లో నటిస్తున్న నాగార్జున తన సినిమాల కన్నా ఇప్పుడు నాగ చైతన్య, అఖిల్ సినిమా పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు. చైతు ఎలాగో హిట్ కొట్టేశాడు మరి మొదటి సినిమాతో ఫ్లాప్ చవిచూసిన అఖిల్ సెకండ్ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: