బ్రహ్మానందం తరువాత ఎవరు ఊహించని విధంగా ప్రస్తుతం టాలీవుడ్లో వెన్నెల కిషోర్ టైమ్ నడుస్తోంది. బిజీగా ఉన్న కమెడియన్లలో స్పూఫ్లు, ప్యారడీలు కాకుండా ఒరిజినల్ కామెడీతో నవ్విస్తోన్నది వెన్నెల కిషోర్ మాత్రమే అని విమర్శకులు కూడ అంగీకరిస్తున్నారు. బ్రహ్మానందంకి క్రేజ్ తగ్గిపోయాక ఆ స్థానం దరిదాపులలోకి వెళ్ళగల కమెడియన్ ఎవరు అన్న చర్చలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి.
పృధ్వీ కొన్ని సినిమాల్లో మెరిసినప్పటికీ మూస ధోరణి వల్ల స్టార్ కమెడియన్ కాలేకపోయాడు. సరిగ్గా ఇలాంటి పరిస్థుతులలో వరుసపెట్టి చాలా సినిమాల్లో తన విభిన్నమైన కామెడీతో నవ్విస్తున్న వెన్నెల కిషోర్ ఇప్పుడు టాలీవుడ్ కమెడియన్స్ లో నెంబర్ వన్ స్థానానికి దగ్గర అవుతున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫిలిం నగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈమధ్య కాలంలో అతనికి డిమాండ్ బాగా పెరగడంతో వెన్నెల కిషోర్ కాల్షీట్ రేటు అమాంతం అయిదంతలు పెరిగిందని వార్తలు వస్తున్నాయి.
ఏడాది క్రితం వరకు కిషోర్ సింగిల్ డే కాల్షీట్ యాభై వేలు ఉన్న నేపధ్యంలో ఇప్పుడు అతనికి రోజుకి రెండున్నర లక్షలు చెల్లిస్తున్నారని టాక్. పెద్ద హీరోల సినిమాలకైతే రోజుకి లక్షన్నర, రెండు లక్షలు అడుగుతున్న కిషోర్ చిన్న చిత్రాలకి మాత్రం రెండున్నర లక్షలు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.
లేటెస్ట్ గా ఈ కమెడియన్ నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ‘అమీ తుమీ’ సినిమాలలో వెన్నెల కిషోర్ నటనకు మరింత ప్రశంసలు లభించడంతో ఇకమీదట అతని రేటు ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం కిశోరే పై వస్తున్న ఈ వార్తలు అన్నీ తెలుగు సినిమారంగాన్ని మూడు దశాబ్దాలకు పైగా హాస్య చక్రవర్తిగా ఏలిన బ్రహ్మానందానికి షాక్ ఇచ్చే వార్తలు అనుకోవాలి..