నంది అవార్డుల కంటే ఫిలిం ఫేర్ అవార్డులను మన టాలీవుడ్ సెలెబ్రెటీలు ఎంతో విలువైనవిగా భావిస్తారు. దీనితో ప్రస్తుతం ఫిలిం ఫేర్ అవార్డ్స్ కు ఏర్పడిన క్రేజ్ మాటలకు అందని విధంగా మారింది. ఈ అవార్డ్స్ ఫంక్షన్ అంతర్జాతీయ స్థాయిలో భారీ ఎత్తున జరిగే నేపధ్యంలో ఈ ఫంక్షన్ పాస్ లకు కూడ విపరీతమైన డిమాండ్ ఉంటుంది.

దీనికితోడు ఇప్పటికే కొనుక్కుంటే ఫిలిం ఫేర్ అవార్డులు వస్తాయి అన్న విమర్శలు ఇప్పటికే అన్ని చోట్ల వినిపిస్తున్న నేపధ్యంలో ఈ అవార్డ్ ఫంక్షన్ కు సంబంధించి మరొక వివాదం లేటెస్ట్ గా తెరపైకి వచ్చింది. 'క్షణం' చిత్రంలో నటించిన అడివి శేష్‌, బుల్లితెర బ్యూటీ అనసూయ భరద్వాజ్‌కి ఫిలింఫేర్‌ కమిటీ ఆహ్వానమే పంపకపోవడం సినీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చలకు తావు ఇస్తోంది.  'ఆహ్వానం పంపలేదుగానీ సరిగ్గా వేడుకల నిర్వహణకు గంట ముందు క్షమాపణ మాత్రం చెప్పారు' అంటూ అడవి శేష్‌ సోషల్‌ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు. 

హాట్ యాంకర్ అనసూయ అయితే 'నాకు క్షమాపణ కూడా చెప్పలేదు' అంటూ  ఫిలింఫేర్ అవార్డ్స్ కార్యక్రమ నిర్వాహకుల పై అసహనం వ్యక్తం చేసింది. అడవి శేష్‌ పలు చిత్రాలతో ఇప్పుడిప్పుడే నటుడిగా ఎదుగుతున్న సెలెబ్రెటీ అయితే బుల్లితెర హాట్ యాంకర్ గా అనసూయ సంచలనాలు తెలిసినవే. 

అయితే వీరిద్దరిని మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది సెలెబ్రెటీలకు మొన్న జరిగిన ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ ఆహ్వానాలు అందలేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో చిన్న వాళ్ళ విషయంలోనే కాకుండా  పెద్దవాళ్ళ విషయంలో కూడ ? ఫిలింఫేర్‌ నిర్వాహకుల తీరు ఒకేలా ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ అవార్డ్స్  ప్రతిభ ఆధారంగా కాకుండా తమ ఈవెంట్‌కి 'గ్లామర్‌' తీసుకొచ్చేవారిని ఎంచుకుని మరీ అవార్డులిస్తున్నారు అన్న కామెంట్స్ ఇప్పటికే వస్తున్న నేపధ్యంలో అడివిశేషు అనసూయల విషయంలో ఫిలిం ఫేర్ అనుసరించిన నిర్లక్షధోరణి టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: