ప్రస్తుతం టాప్ యంగ్ హీరోలలో అల్లుఅర్జున్ అదృష్టం పైనే అందరి దృష్టి ఉంది. బన్నీ సినిమాలు డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలక్షన్స్ విషయంలో మాత్రం సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నాయి. గత సంవత్సరం విడుదలైన ‘సరైనోడు. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా ఆసినిమాకు 70 కోట్ల కలక్షన్స్ రావడం బన్నీ అదృష్టంగానే చెప్పుకోవాలి. 

ఇది ఇలా ఉండగా ఈవారం విడుదల కాబోతున్న ‘దువ్వాడ జగన్నాథం’ మూవీ పై కూడ కలక్షన్స్ పరంగా భారీ అంచనాలు ఉన్నాయి. దీనితో ప్రస్తుతం అల్లుఅర్జున్ హవా టాలీవుడ్ ఇండస్ట్రీలో పరుగులు తీస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ లక్ వెనుక బన్నీ హీరోయిన్స్ లక్ కూడ ఉంది అని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో ప్రిన్స్ మహేష్ బన్నీ హీరోయిన్స్ లక్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. 

వివరాలలోకి వెళితే అల్లు అర్జున్‌తో చేసిన హీరోయిన్స్ అందరికీ మహేష్ మూవీలో‌ ఆఫర్ రావడం కంటిన్యూస్ గా జరుగుతోంది. ఈ విషయం తమన్నా నుంచి రకుల్ ప్రీత్ వరకు కొనసాగుతోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ‘బద్రీనాద్’ లో బన్నీతో చేసిన తరువాత తమన్నా ‘ఆగడు’ లో మహేష్ తో చేసింది. 

‘రేసుగుర్రం’ లో అల్లుఅర్జున్ తో చేసిన శ్రుతిహాసన్ ఆతరువాత మహేష్ తో ‘శ్రీమంతుడు’ లో చేసి భారీ హిట్ ఇచ్చింది. ఇది చాలదు అన్నట్లుగా ‘సరైనోడు’ లో బన్నీతో నటించిన రకుల్ ప్రీత్ ఇప్పుడు ‘స్పైడర్’ లో నటిస్తోంది. ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ‘దువ్వాడ జగన్నాథం’ లో నటించిన పూజ హెగ్డే ను వచ్చే సంవత్సరం వంశీ పైడిపల్లి మహేష్ తో చేయబోయే సినిమాకు హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో అల్లు అర్జున్ హీరోయిన్స్ వెంట మహేష్ బాబు పడుతున్నాడు అంటూ టాలీవుడ్ లో కొందరు జోక్స్ పేలుస్తున్నారు..  
 



మరింత సమాచారం తెలుసుకోండి: