టాలీవుడ్ క్రేజీ డైరక్టర్స్ లో శ్రీనువైట్ల ఒకరు. కమర్షియల్ సినిమాకు కామెడీని అద్దే ఈ డైరక్టర్ సూపర్ హిట్ డైరక్టర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే కొన్నేళ్లుగా శ్రీను వైట్ల కెరియర్ అస్తవ్యస్తంగా ఉంది. స్టార్లు అవకాశం ఇవ్వకున్నా సరే చివరగా మెగా హీరో వరుణ్ తేజ్ మిస్టర్ తో అయినా హిట్ కొడతాడు అనుకుంటే అది కూడా నిరాశ పరచింది.


శ్రీను వైట్ల సినిమా అంటే హీరోలు షేక్ అవుతున్నారు. అందుకే తనకు సూపర్ హిట్ ఇచ్చిన హీరోనే మరోసారి నమ్ముకుంటున్నాడట శ్రీను వైట్ల. 2004లో వెంకీ సినిమాతో శ్రీను వైట్ల సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత 2007లో దుబాయ్ శ్రీను కూడా రవితేజ, శ్రీను వైట్లకు మంచి హిట్టే ఇచ్చింది. ఈ రెండు సినిమాలతో దర్శకుడిగా శ్రీనువైట్ల స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు.  


ఇక ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో తీయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న శ్రీనువైట్ల ట్రాక్ ఎక్కేందుకు మళ్లీ రవితేజతోనే సినిమా తీయాలని చూస్తున్నాడట. ఇప్పటికే ఓ కథ మాస్ మహరాజ్ కు వినిపించడం జరిగిందట. సో మొత్తానికి శ్రీనువైట్ల వేసిన స్కెచ్ అదిరిపోయిందని చెప్పాలి. 


బెంగాల్ టైగర్ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని వరుసగా రెండు సినిమాలను మొదలుపెట్టాడు రవితేజ. టచ్ చేసి చూడు, రాజా ది గ్రేట్ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత శ్రీను వైట్లతో దాదాపు ఫిక్స్ అయినట్టే అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: