ఖైది నంబర్ 150 సినిమా తర్వాత మెగాస్టార్ చేస్తున్న సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథ అందిస్తున్నారు. రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా విషయంలో మెగాస్టార్ భారీ రిస్క్ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే సినిమా కోసం మేకోవర్ అయిన చిరు యాక్షన్స్ ఈన్స్ కోసం ప్రత్యేక ట్రైనింగ్ తీసుకుంటున్నారట.


స్వాతంత్రయోధుడిగా మెగాస్టార్ ప్రత్యేక మైన లుక్ తో కనిపిస్తాడట. ఉయ్యాలవాడలో మెగాస్టార్ చిరంజీవి టఫ్ పర్సనాలిటీతో కనిపిస్తారని ఆ సినిమా నిర్మాత చరణ్ వెళ్లడించారు. సినిమాను భారీ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నంలో చిరు ఎంత రిస్క్ అయినా పర్వాలేదని చెబుతున్నాడట.  


పదేళ్ల తర్వాత మెగా అభిమానుల రిసీవింగ్ చూసి ఆశ్చర్యపోయిన చిరంజీవి సరైన సినిమా తీస్తే మళ్లీ ఇండస్ట్రీ రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయమని అర్ధమైంది. ఈ క్రమంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బాహుబలి స్థాయిలో తీయాలని ఫిక్స్ అయ్యారట. ఇందుకోసం భారీ బడ్జెట్ నే కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: