తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ తనయుడు రాంచరణ్ ‘చిరుత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత వచ్చిన ‘మగధీర’ చిత్రంతో ఆల్ టైమ్ రికార్డులు స్థాపించాడు. ఇండస్ట్రీలో రాంచరణ్ తీసిన సినిమాలు చాలా తక్కువే అయినా దాదాపు అన్ని సూపర్ హిట్ టాక్ వచ్చినవే. గత సంవత్సరం ‘ధృవ’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన చెర్రీ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ ఈ మద్య రిలీజ్ అయ్యింది.
ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ప్రస్తుతం వర్షాకాలం కనుక షూటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిత్ర యూనిట్. సూర్యోదయానికన్నా ముందే ప్రారంభమై, సూర్యాస్తమయం అయ్యే వరకు కొనసాగుతోంది. ఈ క్రమంలో, ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా... రామ్ చరణ్ కు స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం.
తనకు గాయమైనా ఏమీ లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొన్న రాంచరణ్ తర్వాత వెంటనే చికిత్స తీసుకున్నాడుట. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది.