మరొక మూడు రోజులలో విడుదల కాబోతున్న ‘దువ్వాడ జగన్నాథం’ అందుకోబోయే రికార్డుల గురించి అల్లు అర్జున్ అభిమానులు ఇప్పటికే లెక్కలు వేస్తున్నారు. ఈసినిమాకు సంబంధించి బన్నీకి మంచి అంచనాలు ఉన్నా ఎక్కడో ఎదో ఒక భయం ఈమూవీ రిజల్ట్ పై అల్లుఅర్జున్ ను వెంటాడుతోంది అన్న గాసిప్పులు వినపడుతున్నాయి. 

దీనికికారణం పవన్ అభిమానులతో బన్నీకి ఏర్పడిన వైరం ఆ విషయాన్ని మొదట్లో సరిగ్గా డీల్ చేయలేక పోవడంతో ప్రస్తుతం ఆ సున్నిత విషయం పెను సమస్యగా మారింది అన్న వాస్తవం అల్లు అర్జున్ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వాస్తవం గ్రహించాక పవన్ వీరాభిమానులను మచ్చిక చేసుకోవడానికి అల్లు అర్జున్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు పెద్దగా ఫలితాలు ఇవ్వలేకపోయాయి అన్న కామెంట్స్ వస్తున్నాయి.

‘దువ్వాడ’ టీజర్ వచ్చిన డిజ్ లైక్స్ సంఖ్యను బట్టి బన్నీ పై పవన్ అభిమానుల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ వ్యతిరేకతను తగ్గించడం కోసం అల్లుఅర్జున్ ‘డిజే’ ఆడియో వేడుకలో ‘పవన్ అభిమానులు’ అంటూ ప్రశంసలు కురిపించినా ఆ ప్రశంసలు పవన్ అభిమానుల కోపాన్ని ఏమాత్రం చల్లార్చలేక పోయాయి అని అంటున్నారు. 

ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ వీరాభిమానులలోని ఒక వర్గం ‘డిజే’ ప్రీమియర్ షోలకు వెళ్ళి ఆ సినిమా అసలు టాక్ బయటకు రాకుండానే ‘డిజే’ కు వ్యతిరేకంగా నెగిటివ్ టాక్ ను లేదంటే కనీసం డివైడ్ టాక్ ను స్ప్రెడ్ చేయడానికి వ్యూహాలు అల్లుతున్నారు అన్న వార్తలు ప్రస్తుతం గాసిప్పులుగా హడావిడి చేస్తున్నాయి. ఒకవేళ ఈసినిమాకు ఊహించిన విధంగా డివైడ్ టాక్ వస్తే సోషల్ మీడియాలో అల్లుఅర్జున్ పై ట్రోలింగ్ ఒక రేంజ్ లో ఉండేలా పవన్ ఫ్యాన్స్ వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్. 

దీనితో ఈ విషయాలను పసిగట్టిన అల్లు అర్జున్ సోషల్ మీడియాలో తనకు అనుకూలంగా ప్రచారం చేసే పిఆర్ బ్యాచ్ ని ఇప్పటికే రెడీ పెట్టినట్లు టాక్. దీనితో ‘దువ్వాడ’ విడుదలైన వెంటనే ఈ ఇరు వర్గాల మధ్య కామెంట్స్ పోరుకు రంగం సిద్ధం అయింది అని తెలుస్తోంది. అయితే ఈ ప్రచారాలు అన్నీ ‘డిజే’ కు డివైడ్ టాక్ వస్తే ప్రభావం చూపెడతాయి కానీ ‘డిజే’ సామాన్య ప్రేక్షకులకు విపరీతంగా నచ్చితే ఈ వ్యూహాలు ఏవీ పనిచేయవు  అన్నది వాస్తవం ...


మరింత సమాచారం తెలుసుకోండి: