యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బుల్లితెరలో చేస్తున్న షో బిగ్ బాస్.. రియాలిటీ షోస్ లో ఓ ప్రభంజనం సృష్టించిన ఆ షో ఎన్నో వివాదాలకు దారి తీసింది. ముఖ్యంగా కొన్ని ఎపిసోడ్స్ అయితే మరి దారుణంగా సంచలనంగా మారాయి. హిందిలో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ షోను ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ కు విస్తరించారు. 


ఈ తరుణంలో టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈ షోకి హోస్ట్ గా ఉంటున్నారు. ఇప్పటికే ఈ షోకి సంబందించిన పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేశారు. రెండు సీజన్లుగా నడిచే ఈ రియాలిటీషో షూటింగ్ మొత్తం ముంబైలోనే చేస్తున్నారట. అయితే ఇక్కడ వచ్చిన పెద్ద చిక్కేంటంటే బిగ్ బాస్ షో అంటే భయపడుతున్నారు ఆడియెన్స్.


తెలుగులో బిగ్ బాస్ కొత్తగా ట్రై చేస్తారేమో అనుకుంటే ప్రోగ్రాం కాన్సెప్ట్ మాత్రం అదే అంటున్నారు. అందుకే జూనియర్ బిగ్ బాస్ కు కంటెస్టంట్స్ కరువయ్యారని టాక్. అంతే కాకుండా రోజులు తరబడి అక్కడే ఉండాల్సిన అవసరం ఉంటుంది అందుకే దానికి కంటెన్స్టంట్స్ సుముఖంగా లేరని తెలుస్తుంది. 


మొదట ట్రైల్ ఎపిసోడ్ ఒకటి చూసి ఆ తర్వాత ఒరిజినల్ ఎపిసోడ్స్ ప్లాన్ చేయాలని చూస్తున్నారు. ఇక తెలుగులో రానున్న అత్యంత భారీ బడ్జెట్ ప్రోగ్రాం ఇదే కావొచ్చు.. ఈ ప్రోగ్రాం కోసం 45 కోట్ల దాకా కర్చు చేస్తున్నారట స్టార్ మా నిర్వాహకులు. రెండు సీజన్ల వరకు తారక్ 7 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్. ఎన్.టి.ఆర్ ను తీసుకుందే షో నిలబెట్టడానికి మరి తెలుగు బిగ్ బాస్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: