టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటుడుగా పేరుగాంచిన రాజ రవీంద్ర తన ప్రతిభకు తగ్గట్టుగా తన కెరియర్ లో రాణింపుకు రాలేదు అన్న కామెంట్స్ ఉన్నాయి. దీనితో ప్రస్తుతం అతడు మధ్యమధ్య సినిమాలు చేస్తూనే చాలామంది హీరోలకు మేనేజర్ గా వ్యవహరిస్తున్నాడు. అటువంటి ఈ సీనియర్ నటుడు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యంగ్ హీరో రాజ్ తరుణ్ దీనస్థితి గురించి కొన్ని షాకింగ్ నిజాలు బయటపెట్టి చాలామందికి ఆశ్చర్యం కలిగించాడు.

పెద్దపెద్ద వ్యాపారాలు ఉద్యోగాలు చేయడం వల్ల డబ్బు వస్తుంది కానీ డబ్బు కీర్తి రెండు ఒక వ్యక్తికి వచ్చే అవకాశం ఒక్క సినిమా రంగంలోనే ఉంది అంటూ ముఖ్యమంత్రి నుండి సాధారణ స్థాయి ప్రజల వరకు సినిమా నటులు పట్ల క్రేజ్ తోనే ఉంటారు అన్న కామెంట్స్ చేశాడు. అయితే నటుడుగా రాణించాలి అంటూ వైజాగ్ నుండి వచ్చిన రాజ్ తరుణ్ ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో తనకు తెలుసు అంటూ రాజ్ తరుణ్ గురించి కొన్ని షాకింగ్ నిజాలు బయట పెట్టాడు. 

రాజ్ తరుణ్ ను చూసినప్పుడు చాలామంది సులువుగా హీరో అయిపోయాడని అనుకుంటారని సినిమా ఇండస్ట్రీకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలామంది దగ్గర పనిచేసి చివరకు వచ్చిన డబ్బు చాలక ఇంటి అద్దె కూడ కట్టలేక 15 రోజులు రోడ్డు మీద ఉన్న పరిస్థితి తనకు తెలుసు అంటూ షాక్ అయ్యే నిజాలను బయట పెట్టాడు. దాదాపు 10 రోజులు సరైన తిండి కూడ లేక ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ ను చూసి తనకు కన్నీరు వచ్చిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు. 

అయితే ఆ పరిస్థుతులలో అనుకోకుండా వచ్చిన ‘ఉయ్యాల జంపాల’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ‘కుమారి 21 ఎఫ్’ మూవీతో క్రేజీ హీరోగా మారిన నేపధ్యాన్ని గుర్తుకు చేసాడు. అయితే ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం లేనిదే ఆ వ్యక్తులు రాణించరు అని అంటూ రాజ్ తరుణ్ గురించి ఇంకా అనేక ఆసక్తికర విషయాలను ఈ ఇంటర్యూలో షేర్ చేశాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: