తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య కొన్ని సంఘటనలు చూస్తుంటే..చాలా ఆశ్చర్యం, బాధ అనిపిస్తున్నాయి.  తాజాగా వర్థమాన హాస్యనటుడు డివి నాయుడు ఇంటిపై  'నేనేరాజు నేనే మంత్రి' చిత్రం విలన్ రాము దాడి చేశారు.  ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది.వర్థమాన హాస్య నటుడు డివి నాయుడు మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.  

'నేనేరాజు నేనే మంత్రి' చిత్రం లో నటించిన రాము తన ఇంటిపై దాడి చేయడమే కాకుండా ఇంట్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని   నాయుడు జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. అకారణంగా తన ఇంటిపై దాడి చేసి వీరంగం సృష్టించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున‍్న పోలీసులు దర్యాప్తు చేస‍్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: