పూరీ జగన్నాధ్ బాలకృష్ణల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘పైసా వసూల్’ సినిమా నిర్మాణం అనుకున్నంత వేగంతో ఇంచుమించు చివరి దశకు చేరుకోవడంతో ఈ సినిమాను సెప్టెంబర్ 29న విడుదలచేయడానికి అన్నీ సిద్దం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఈ మధ్యనే పోర్చుగల్ వెళ్ళి వచ్చిన బాలకృష్ణ ఈ మూవీకి సంబంధించి త్వరలో హైదరాబాద్ లో ప్రారంభంకాబోతున్న మరో షెడ్యూల్ కు రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్ గా బాలకృష్ణ పక్కన శ్రియ శరణ్ నటిస్తున్నప్పటికీ ఆమె మెయిన్ లీడ్ కాదట. ఇంకో హీరోయిన్ ఈ మూవీలో బాలకృష్ణ పక్కన మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె పేరు ముస్కాన్ అని తప్పించి ఇప్పటివరకు ఆమెకు సంబంధించిన వివరాలు ఫోటోలు మీడియాకు లీక్ కాలేదు.
దీనితో ఈమెకు సంబంధించిన వివరాలను ఫోటోలను మీడియాకు విడుదల చేసారు. ఈ అమ్మాయి ముంబాయ్ మోడలింగ్ సర్కిల్స్ లో బాగా పాపులర్ అని తెలుస్తోంది. ఇప్పటికే ముంబైలో తన సెక్సీ ఫోటో షూట్లతో ర్యాంప్ వాగే లతో ఈమె బాలీవుడ్ మీడియా దృష్టి బాగా ఆకర్షించింది.
మోడలింగ్ రంగంలోంచి సినిమాల్లోకి వచ్చిన ముస్కాన్ సేథికి బాలయ్య 'పైసా వసూల్' తరువాత చాల మంచి అవకాశాలు వస్తాయి అన్న ప్రచారం జరుగుతోంది. తన సినిమాలలో కొత్త హీరోయిన్లను ఇంట్రడ్యూస్ చెయ్యడం పూరికి కొత్త విషయం కాదు.
అదేవిధంగా తన కొత్త హీరోయిన్స్ చేత పూరి జగన్నాథ్ చాల ఎక్కువగా రామ్ గోపాల్ వర్మ స్టైల్ లో బాగా ఎక్స్ పోజింగ్ చేయిస్తూ ఉంటాడు. అయితే ఈ హాట్ బ్యూటీ మరీ చిన్న అమ్మాయిలా కనిపిస్తున్న నేపధ్యంలో బాలకృష్ణ పక్కన ఈమె ఏమాత్రం సెట్ అవుతుంది అన్న సందేహాలు సాధారణ ప్రేక్షకుడికే కాక బాలయ్య అభిమానులకు కూడ వచ్చి తీరుతాయి..