సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ తో చేస్తున్న స్పైడర్ మూవీ టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే శ్రీమంతుడు డైరక్టర్ కొరటాల శివతో భరత్ అను నేను ప్రాజెక్ట్ ఫిక్స్ చేశాడు మహేష్. ఆ సినిమా మొదటి షెడ్యూల్ మహేష్ లేకుండానే పూర్తి చేయగా ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ లో మహేష్ కూడా పాల్గొంటున్నాడట.   


భరత్ అను నేను సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడని తెలుస్తుంది. సిఎంగా మహేష్ ఊహించడానికే కొత్తగా ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. హైదరాబాద్ అవుట్ స్కట్స్ లో అసెంబ్లీ సెట్ వేయగా ప్రస్తుతం అసెంబ్లీలో జరిగే సన్నివేశాలు షూట్ చేస్తున్నారట. సిఎం మహేష్ అసెంబ్లీలో అదరగొట్టేస్తున్నాడని టాక్.  


సినిమాలో సిఎం లుక్ లో మహేష్ ఎలా ఉంటాడు అన్న దాని మీద ఎలాంటి లీకులు రాకుండా జాగ్రత్తపడుతున్నారట. సినిమా షూటింగ్ టైంలో ఎలాంటి సెల్ ఫోన్ కూడా వాడరాదని చిత్రయూనిట్ కు కండీషన్ పెట్టారట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుందట.


మహేష్ ఫ్యాన్స్ కు ఈ సినిమా కచ్చితంగా ఓ ఫీస్ట్ ఇస్తుందని అంటున్నారు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లతో సూపర్ హిట్ అందుకున్న కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న భరత్ అను నేను కూడా శివతో డబుల్ హ్యాట్రిక్ కంటిన్యూ చేస్తాడేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: