ఎప్పుడైతే అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం మొదలు పెట్టాడో అప్పటినుండి వివాదాలు మొదలయ్యాయి. ఇక సినిమాలో గుడిలో బడిలో సాంగ్ తో బ్రాహ్మణ సంఘాలు మరింత గొడవ చేశారు. ఫైనల్ గా ఎలాగో ఆ పాటను మార్చి లిరిక్ విడుదల చేశారు. అయితే ఇప్పుడు రిలీజ్ కు ఒక్కరోజు ముందు మళ్లీ డిజెకు బ్రాహ్మణ సంఘాలు షాక్ అయ్యేలా చేస్తున్నారు.

రేపు రిలీజ్ అవనున్న డిజెలో హీరో క్యారక్టరైజేషన్ బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని హైకోర్ట్ లో మరో కేసు వేస్తున్నారట. ఇది కనుక వేయడం జరిగితే బన్ని డిజె రేపు రిలీజ్ అవ్వడం డౌటే అంటున్నారు. సినిమాలో హీరో బ్రాహ్మణుడు అన్న మాత్రనా ప్రతి విషయంలో ఇలా సినిమాను ఇబ్బంది పెట్టాలని చూడడం విచిత్రంగానే ఉంది.


హైకోర్ట్ లో సినిమా విచారణకు స్వీకరిస్తే రేపు రావాల్సిన సినిమా వస్తుందా రాదా అన్నది మెగా అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. అయితే దర్శక నిర్మాతలు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా రిలీజ్ హంగామా మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా 1800 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా 300 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారట.  


దిల్ రాజు నిర్మాణంలో హరిష్ శంకర్ డైరక్షన్ చేసిన ఈ సినిమాలో పూజా హెగ్దె గ్లామర్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని ట్రైలర్స్ చూస్తేనే అర్ధమవుతుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సాంగ్స్ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: