దేవీశ్రీప్రసాద్ ప్రసాద్ పేరు వింటేనే ప్రస్తుతతరం యూత్ జోష్ లోకి వెళ్ళిపోతారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతాన్ని అందించిన ఈ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రస్తుతం సినిమా సంగీతానికి సంబంధించి కింగ్ ఆఫ్ టాలీవుడ్ గా అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ప్రస్తుతం అతడికి ఉన్న క్రేజ్ కు దాదాపు 1.50 కోట్ల భారీ పారితోషికం ఇతడు నిర్మాతల నుండి పొందుతున్నాడు అంటే దేవీశ్రీప్రసాద్ మ్యానియా ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతుంది. 

ఇలాంటి పరిస్థుతులలో ఇంత క్రేజీ డైరెక్టర్ ఈమధ్య ఆస్ట్రేలియా – న్యూజిలాండ్ దేశాలలో నిర్వహించిన స్టేజ్ షోలు అత్యంత ఘోరంగా విఫలం కావడం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. దేవీశ్రీప్రసాద్ తన మ్యూజిక్ షోలకు భారీ మొత్తంలో ఆదాయం వస్తుందని ఒక ఈవెంట్ మ్యానేజిమెంట్ కంపెనీతో ఎగ్రిమెంట్ చేసుకుని సుమార్ 3 కోట్లు ఆదాయాన్ని టార్గెట్ చేసుకుని తన టోటల్ టీమ్ తో ఆస్ట్రేలియా – న్యూజిలాండ్ పర్యటనకు ఈమధ్య వెళ్ళాడు. 

అయితే అక్కడ ఏర్పాటు చేసిన దేవీశ్రీప్రసాద్ షోలకు 200 వందల డాలర్లను టిక్కెట్ ధరగా నిర్ణయించారు. అయితే దేవీశ్రీప్రసాద్ కు ఎంత క్రేజ్ ఉన్నా ఈ భారీ మొత్తంలో పెట్టిన టిక్కెట్ కు అతి తక్కువ స్పందన రావడంతో దేవీశ్రీప్రసాద్ ఆస్ట్రేలియా – న్యూజిలాండ్ దేశాలలో ఏర్పాటు చేసిన అనేక ప్రదర్శనలకు కనీసపు సంఖ్యలో కూడ ప్రేక్షకులు రాలేదని వార్తలు వస్తున్నాయి. 

దీనితో షాక్ అయిన దేవీశ్రీప్రసాద్ తన పర్యటను త్వరగా ముగించుకుని తిరిగి ఇండియా వచ్చేసినట్లు తెలుస్తోంది. అయితే బాలీవుడ్ పాపులర్ హీరో షారూఖ్ ఖాన్ షోలకు 300 డాలర్ల టిక్కెట్ పెట్టి ఆ షోలను చూసిన ఆదేశాలలోని మన తెలుగువారు దేవిశ్రీ స్టేజ్ షోలను నిర్లక్ష్యం చేయడం హాట్ న్యూస్ గా మారింది. అయితే ఇళయరాజాకు కూడ ఇటువంటి అనుభవమే గతంలో స్టేజ్ షోల విషయంలో ఎదురైన నేపధ్యంలో దేవిశ్రీప్రసాద్ ఆ విషయాలను పరిగణలోకి తీసుకోకుండా సాహసం చేసాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: