తెలుగు ఇండస్ట్రీలో "శంకరాభరణం తులసి"గా మంచి పేరు తెచ్చుకున్న తులసి తర్వాత హీరోయిన్ గా నటించింది. గత కొంత కాలంగా తల్లి పాత్రల్లో నటిస్తూ..బాగా బిజి అయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తులసి మాట్లాడుతూ..జూనియర్ ఎన్టీఆర్ ని తెగ పొగిడేసింది. ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎన్టీఆర్ ని ఎప్పుడూ చూడలేదట...అయితే ఆయన నటన అంటే మాత్రం చాలా ఇష్టమని చెప్పింది. ఈ మద్య ఎన్టీఆర్ ని కలిసిన తర్వాత ఆయన ఎంత మంచి వారో మాటల్లో చెప్పలేనని ఎమోషన్ కి గురయ్యారు.
నేను వస్తున్నానని చెబితే ముఖ్యమైన సీన్ను వదిలేసి మరీ నా కోసం వచ్చారు. నన్ను ఆయన రిసీవ్ చేసుకున్న పద్దతి చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేసింది. ‘అయ్యో అమ్మా.. మీకెందుకు అమ్మా.. నేను వస్తున్నాను’ అంటూ ఆయన నా దగ్గరకు వచ్చారు. ఆయన్ను కలిసాక ఇంకా అర్థమైంది... నాకు కళ్లలో నీళ్లు తిరగడం చూసి ఆయన కళ్లు కూడా చెమర్చాయని తులసి తెలిపారు.
నా కోసం షూటింగ్ వదిలేసి మరీ మీరిలా వచ్చారు అని అంటే మీకెందుకమ్మా నేనున్నాను అనే భరోసా ఇచ్చారు. కంట్లో ఆ తడి ఎందుకు రావాలమ్మా అని అన్నారు. అదే నన్ను బాగా కదిలించేసింది అని తులసి అన్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడినన్న గర్వం ఎన్టీఆర్ లో అస్సలు లేదని..చాలా సింపుల్ గా అందరితో కలిసిపోయే వ్యక్తి అని తులసి సంతోషం వ్యక్తం చేశారు.
అన్ని విద్యలు తెలిసిన వ్యక్తి... ఆ అబ్బాయి ఇక్కడితో ఆగడు...ఇండస్ట్రీలో గొప్ప స్థాయికి వెళ్తాడని అన్నారు. ఆయన అమ్మా అని నన్ను పిలిచారు. నిజమే నేను ఆయనకు అమ్మ లాంటిదాన్నే. ఎన్టీఆర్ బంగారం. ఈ అబ్బాయి మీరు చూసే అబ్బాయి కాదు. ఎక్కడో ఉండాల్సిన అబ్బాయి'' అని అంటూ ఎంతో గొప్పగా చెప్పారు తులసి.