పవన్ కళ్యాణ్ క్రేజ్ వీచే గాలిలో కూడ ఉంటుంది అంటూ ఎంతోమంది ఇప్పటికి కామెంట్స్ చేసిన నేపధ్యం తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే పవన్ పేరు చెపితే పులకరించిపోయే లక్షలాది మంది అభిమానులు మన ఇరు రాష్ట్రాలలోను ఉన్నారు. ఈ మ్యానియాకు నిదర్శనంగా ప్రస్తుతం భాగ్యనగరంలోని సారధి స్టూడియోస్ లో జరుగుతున్న ఒక సంఘటన అందర్నీ ఆకర్షిస్తోంది. 

గత కొద్ది రోజులుగా పవన్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందింప బడుతున్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను సారధి స్టూడియోస్ లో ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్ లో చిత్రీకరిస్తున్నారు. పవన్ కూడ క్రమం తప్పకుండా ప్రతిరోజు షూటింగ్ స్పాట్ కు వస్తూ ఈసినిమా వేగంగా పూర్తి అవ్వడానికి దర్శకుడు త్రివిక్రమ్ కు తన వంతు సహకారాన్ని అందిస్తున్నాడు. 

ఈ నేపధ్యంలో ఉదయం షూటింగ్ కు వచ్చిన పవన్ ను తిరిగి సాయంత్రం తిరిగి వెళ్ళేడప్పుడు చూడడానికి వందల కొద్ది సంఖ్యలో సారధి స్టూడియోస్ గోడ ఎక్కి పవన్ గురించి ఎదురు చూడటం పవన్ కూడ ప్రతిరోజు తనకోసం ఎదురు చూస్తున్న అభిమానులను చిరునవ్వుతో పలకరిస్తూ చేతులు ఊపుతూ అభివాదాలు తెలపడం రొటీన్ సీన్ గా మారిపోయింది. మధ్యలో వాన వచ్చినా చెదిరి పోకుండా ఆ అభిమానులు పవన్ గురించి ఎదురు చూస్తున్న వారి ఆకాంక్షను గమనిస్తే పవన్ మ్యానియా ఏ విధంగా రోజురోజుకి యూత్ లో పెరిగి పోతోందో అర్ధం అవుతుంది.

తన కోసం ఎదురు చూస్తున్న అభిమానుల కష్టాలను గమనించిన పవన్ వారికి ఈ సినిమా యూనిట్ వారితో చెప్పి చిన్నచిన్న మినరల్ వాటర్ బాటిల్స్ పంపుతున్నట్లు తెలుస్తోంది. ఈ అనుకోని అతిథి మర్యాదకు పవన్ అభిమానులు మురిసిపోతున్నట్లు టాక్. నిన్న పవన్ ఈ షూటింగ్ మధ్యన తన ‘జనసేన’ ఆఫీసుకు వెళ్ళి అక్కడ ‘జనసేన’ కార్యకర్తలుగా ఎంపిక అయిన అనేకమంది స్పీచ్ వీడియోలను వారు వ్రాసిన వ్యాసాలను చూసి ఆనందపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అభిమానం ఓట్ల రూపంలో పవన్ తిప్పుకోకలిగితే 2019 ఎన్నికలలో పవన్ ‘జనసేన’ సంచలనాలు సృష్టించినా ఆశ్చర్యం లేడు..  



మరింత సమాచారం తెలుసుకోండి: