స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరిష్ శంకర్ కాంబినేషన్ లో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా దువ్వాడ జగన్నాధం. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా ఫస్ట్ టాక్ ను బట్టి చూస్తే సినిమా అనుకున్నంత రేంజ్ రాలేదని తెలుస్తుంది. బ్రాహ్మణ యువకుడిగా బన్ని అదరగొట్టినా కథలో దమ్ములేకపోవడం మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు.


అయితే ప్రతి సినిమాకు కొత్త కథతో వచ్చే బన్ని ఈసారి ఎందుకు రొటీన్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు అన్నది ఎవరికి అర్ధం కాని విషయం. తన క్యారక్టర్ ఎలివేట్ అవడం కోసం అగ్రహారం బ్రాహ్మణ పాత్ర చేశాడో తప్ప అందుకు పక్కాగా లెక్క ఏం లేదని చెప్పాలి. కథ పాతదే అయిన కథనంలో కూడా అదే మూస పద్ధతిలో నడిపించాడు దర్శకుడు హరిష్ శంకర్.


దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూ తెలుసు.. అయితే ఇలాంటి ఎన్నో కథలు ఇప్పటికే తెలుగు ఆడియెన్స్ చూసి చూసి ఉన్నారు. కథలో ఎలాంటి కొత్తదనం లేకపోగా రొటీన్ స్క్రీన్ ప్లే.. అనవసరపు హంగులతో కానిచ్చేశాడు. డిజె కథ విషయంలో బన్ని బ్లెండర్ మిస్టేక్ చేశాడని కామెంట్లు వస్తున్నాయి.


ఇక సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. కచ్చితంగా సినిమా తర్వాత అమ్మడికి మంచి అవకాశాలు వచ్చే వీలుంటుంది. పక్కా కమర్షియల్ మూవీగా వచ్చిన డిజె ఫైనల్ టాక్ ఏంటన్నది ఈరోజు సాయంత్రం కల్లా తెలుస్తుంది. అయితే ప్రీ రిలీజ్ హంగామా బన్ని కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా సినిమా మొదటి రోజు మాత్రం బాగానే వసూళ్లు రాబట్ట వచ్చని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: