మహానటి సావిత్రి జీవితం ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ‘మహానటి’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్న సమంత పెళ్ళి అక్టోబర్ లో ఉన్న నేపధ్యంలో ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాలతో పాటు మిగతా కీలక సన్నివేశాలను కూడ చాల వేగంగా తీస్తున్నారు. 

ఇది ఇలా ఉండగా ‘సావిత్రి’ జీవితంలోను అదేవిధంగా ఆమె సినిమాలకు సంబంధించి ఎంతగానో ప్రోత్సహించిన మహానటుడు ఎస్వీ రంగారావు పాత్రను మొదట్లో ప్రకాష్ రాజ్ చేత చేయించాలి అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈసినిమా దర్శక నిర్మాతల ఆలోచనలు మారడంతో ప్రకాష్ రాజ్ స్థానంలో మోహన్ బాబును ఎస్వీఆర్ పాత్రకు ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు ఈ న్యూస్ షాకింగ్ న్యూస్ గా మారింది. చాల గంభీరంగా కనిపించే ఎస్వీఆర్ పాత్రకు మోహన్ బాబు తన లుక్ రీత్యా న్యాయం చేయగలడా అన్న అనుమానాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు. అయితే డైలాగ్స్ పలకడంలో ఎస్వీఆర్ రేంజ్ లో డైలాగ్స్ చెప్పే స్థాయి మోహన్ బాబుకు ఉండటంతో ఈ మార్పు జరిగి ఉండవచ్చు అని అంటున్నారు. 

ఇది ఇలా ఉండగా సీనియర్ ఎన్టీఆర్ పాత్రకు జూనియర్ ను ఇప్పటికే సంప్రదించిన నేపధ్యంలో ఈ సినిమాలోని ఆ పాత్రను చేయాలా వద్దా అన్న మీమాంసలో జూనియర్ తన సస్పెన్స్ ను కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో టాప్ హీరోల సినిమాలలో ప్రకాష్ రాజ్ లేకుండా పోతున్న నేపధ్యంలో ఇప్పుడు ‘మహానటి’ సినిమాలో కూడ ప్రకాష్ రాజ్ పాత్రకు మోహన్ బాబు ఎంపిక కావడం ఒక విధంగా ప్రకాష్ రాజ్ కు ఊహించని షాక్ అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: