రచయితగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత దర్శకుడుగా మారి చిట్టచివరకు నటుడుగా మారి ప్రస్తుతం తన నటనతో తెలుగు సినిమా తెరను షేక్ చేస్తున్న పోసాని కృష్ణ మురళికి జూనియర్ బిగ్ బాస్ షో ఊహించని అదృష్టంగా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ షో మరో రెండు నెలలలో ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో ఈ షోలో పాల్గొనే పార్టిసిపెంట్స్ కోసం స్టార్ మాటివి తీవ్ర స్థాయిలో అన్వేషణ చేస్తున్న విషయం తెలిసిందే.

బూతు డైలాగ్స్ తో పాటు అనేక సంచలనాలకు చిరునామాగా ఉండే ఈ బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి చాలామంది సెలెబ్రెటీలు వారి కుటుంబాలకు చెందిన పిల్లలు తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి అయిష్టత వ్యక్త పరుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నెగిటివ్ ట్రెండ్ ను లెక్క చేయకుండా పోసాని కృష్ణ మురళి జూనియర్ ‘బిగ్ బాస్’ షోలో పాల్గొనడానికి తన అంగీకారాన్ని తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.

ఎవరూ ఊహించని విధంగా ఈ షోలో పాల్గొన్నందుకు పోసానికి 2.5 కోట్ల భారీ పారితోషికం ఈ షో నిర్వాహకులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు బుల్లితెర రంగంలో ఒక షోలో పార్టిసిపెంట్ గా పాల్గొనబోయే ఒక సెలెబ్రెటీకి ఈ స్థాయిలో భారీ పారితోషికం ఇచ్చినా సందర్భాలు లేవు అని అంటున్నారు.

పోసాని వల్ల ఈషోకు చాల మంచి రేటింగ్స్ వస్తాయి అన్న ఉద్దేశ్యంతో స్టార్ మాటివి ఈ ఎత్తుగడ వేసింది అని అంటున్నారు. ఇప్పటికే జూనియర్ కనీవినీ ఎరుగని భారీ పారితోషికం ఆఫర్ ఈ షో వల్ల పొందుతున్న నేపధ్యం తెలిసిందే. దీనితో జూనియర్ క్రేజ్ తో పాటు పోసాని బూతు మాటల సెటైర్లతో జూనియర్ బిగ్ బాస్ షో ఆదర గొట్ట బోతోంది అన్న అంచనాలు పెరిగి పోతున్నాయి. దీనికితోడు ఈషోలో పాల్గొనడానికి యంగ్ హీరోయిన్స్ తేజస్విని మధుశాలిని అంగీకరించిన నేపధ్యంలో ఈ షోకు కావలసిన అన్ని మసాలాలు సమకూరినట్లే అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: