స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్త అత్యుత్సాహంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ను కెలుకుతూ చేసిన చెప్పను బ్రదర్ ఇప్పటికి హాట్ న్యూస్ అనే చెప్పాలి. ఏమాత్రం ఛాన్స్ ఉన్నా సరే పవన్ ఫ్యాన్స్ బన్నిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అయితే నిన్న రిలీజ్ అయిన అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.  


సినిమా ఎలా ఉన్నా ఆడించే సత్తా కొంతమంది ఫ్యాన్స్ కు ఉంటుంది. యావరేజ్ టాక్ వచ్చిన సినిమాను హిట్ చేసే భాధ్యత వారిదే అయితే ఈ క్రమంలో నిన్న మిక్సెడ్ టాక్ తెచ్చుకున్న డిజెని చీల్చి చెండాడుతున్నారు పవన్ ఫ్యాన్స్. సినిమా చూసి బయటకు వస్తున్న వారితో పబ్లిక్ టాక్ కనుక్కుంటుంటే సినిమా పట్ల ఏం చెప్పలేం బ్రదర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


అసలు ఈ చెప్పను బ్రదర్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుండి వచ్చిందో కాని అది బన్ని పాలిట శాపంగా మారింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న బన్ని అనవసరంగా పవన్ ఫ్యాన్స్ జోలికి వెళ్లి అడ్డంగా బుక్ అయ్యాడు. సినిమా టాక్ ఎలా ఉన్నా పబ్లిక్ మాత్రం చెప్పను బ్రదర్ చెప్పలేను బ్రదర్ అనే కామెంట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.


డిజెతో బన్ని అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు అన్నది వాస్తవం. రొటీన్ కథలకు భిన్నంగా స్టార్ హీరోల్లో వరుసగా 50 కోట్ల మార్క్ దాటిన బన్ని డిజె కలక్షన్స్ పరంగా వర్క్ అవుట్ అవ్వొచ్చేమో కాని ఆడియెన్స్ మనసులను గెలుచుకోలేదు. సో డిజె లెక్క తప్పింది కాబట్టి బన్ని తర్వాత సినిమా మీదైనా తన ఫోకస్ పెంచుతాడేమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: