రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందింపబడుతున్న ‘రంగస్థలం 1985’ షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలలో అత్యంత వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈసినిమాను మొదట్లో దసరా రేసుకు విడుదల చేస్తారు అని అందరూ అనుకున్నా ఈసినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో సంక్రాంతికి వాయిదా పడింది అని అంటున్నారు.  

ఈసినిమాలో ఒక కీలక పాత్రను అనసూయ చేయబోతున్నట్లు ఇప్పటి వరకు వచ్చిన గాసిప్పులను నిజం చేస్తూ అనసూయ తన ట్విటర్ ఎకౌంట్ లో తాను ఈ సినిమాలో ఒక కీలక పాత్రను చేస్తున్న విషయాన్ని బయట పెట్టింది. ఈ మూవీ షూటింగ్ స్పాట్ కు వెళుతూ ‘రంగస్థలం 1985’ యూనిట్ కు స్వాగతం అని వ్రాసి ఉన్న ఒక పెద్ద బోర్డ్ ఫోటోను తన ట్విటర్ లో షేర్ చేసింది.

ఇది ఇలా ఉండగా ఈసినిమాకు జరుగుతున్న బిజినెస్ ను చూసి టాలీవుడ్ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి. ఈసినిమా శాటిలైట్ రైట్స్ కింద 16 కోట్లు డిజిటల్ రైట్స్ కింద 13 కోట్లు బిజినెస్ జరిగిన నేపధ్యం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. చరణ్ లేటెస్ట్ మూవీ ‘ధృవ’ కు 50 కోట్ల నెట్ కలక్షన్స్ మించి రాకపోయినా ఈసినిమాకు జరుగుతున్న బిజినెస్ ఎవరికీ అంతుపట్టని విషయంగా మారింది. 

ఇక క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఈసినిమా కథ విషయంలోనే కాకుండా టేకింగ్ విషయంలో కూడ అనేక ప్రయోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలలో ఈసినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను తీస్తున్న సుకుమార్ ఈసినిమాకు సంబంధించిన ఫైట్స్ ను కూడ చాల డిఫరెంట్ గా కంపోజ్ చేయిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం మనం చూస్తున్న చాల సినిమాలలోని గాల్లో ఎగరడాలు, కొడితే ఎక్కడో పడిపోవడాలు లాంటి రోప్ టెక్నిక్స్ వాడకుండా అత్యంత సహజంగా ఈ సినిమాలోని ఫైట్స్ ను చిత్రీకరిస్తున్నట్లు టాక్. చరణ్ కెరియర్ కు సంబంధించి ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం అత్యంత కీలకం అయిన నేపధ్యంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ ఈసినిమా విషయంలో సుకుమార్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: