ఊహించిన స్థాయిలో ఈ సమ్మర్ సీజన్ ను టాప్ హీరోలు ఎవరూ క్యాష్ చేసుకోలేక పోయినా అందరి దృష్టి సెప్టెంబర్ లో జరగబోతున్న దసరా రేస్ పై  పడింది. ఎప్పుడు లేని విధంగా ఈసారి దసరా రేస్ ను టార్గెట్ చేస్తూ 6 సినిమాలు రిలీజ్ కావడానికి ప్రయత్నిస్తూ ఉండటం ఇప్పడు సంచలనంగా మారడమే కాకుండా ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది.

ఆల్రెడీ సెప్టెంబర్ 21న తన ''స్పైడర్'' రిలీజ్ అంటూ గతంలో మహేష్ కన్ఫమ్ చేశా. మురుగుదాస్ డైరెక్షన్లలో రూపొందింపబడ్డ ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఇప్పుడు అదే డేట్ ను టార్గెట్ చేస్తూ నిర్మాత కళ్యాణ్ రామ్ ‘జూనియర్ అభిమానులకు రంజాన్ గిఫ్ట్ ‘జై లవ కుశ’ సెప్టెంబర్ 21న విడుదల కాబోతోంది అని ప్రకటించాడు. 

దీనితో రాబోతున్న దసరా మహేష్ జూనియర్ల మధ్య డైరెక్ట్ ఫైట్ గా మారుతుందా లేదంటే ‘స్పైడర్’ మళ్ళీ వెనక్కు వెళ్ళుతుందా అన్న చర్చలు ఇప్పుడు మళ్ళీ ఊపు అందుకున్నాయి. అయితే అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అయితే బయ్యర్లు అంగీకరిస్తారా అన్న అనుమానాలు కూడ కొందరు వ్యక్తం చేస్తున్నారు. 

దీనికితోడు ఇదే దసరా సీజన్ ను నమ్ముకుని పూరి జగన్నాథ్ బాలకృష్ణలు అత్యంత వేగంగా రూపొందిస్తున్న ‘పైసా వసూల్’ మూవీ పరిస్థితి ఏమిటి అన్న అనుమానాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పోర్చుగల్ షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ మళ్ళీ జూలై 3న మొదలై దాదాపు ఆ నెలంతా కొనసాగుతుంది. 

దీనితో ఈ సినిమా కూడ దసరాకు రావడం ఖాయం అని అంటున్నారు. ఈ పరిస్థితులలో సంక్రాంతి రేస్ ను మించి దసరాకు జరగబోతున్న రేస్ లో చిట్టచివరకు ఈముగ్గిరిలో ఏ ఇద్దరు మిగులుతారు అన్న విషయం ప్రస్తుతానికి ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: