యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ మాలో బిగ్ బాస్ ప్రోగ్రాం హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటుగా జేమ్స్ బాండ్ తరహాలో వదిలిన టీజర్ కూడా అదరహో అనిపించింది. ఈ క్రమంలో షో గురించి అందులో పార్టిసిపెంట్స్ గురించి ఇంట్రెస్టింగ్ డీటేల్స్ బయటకు వస్తున్నాయి.  


టీజర్ లో తారక్ పక్కన సోయగాల అన ఆ ఇద్దరు ఎవరో కాదు లీడింగ్ హీరోయిన్స్ అని అంటున్నారు. ఇంతకీ వారెవరు అంటే ఒకరు తేజశ్వి, మరొకరు మధుశాలిని అంటున్నారు. టీజర్ లో ఎన్.టి.ఆర్ పక్కన ఉన్నది ఈ ఇద్దరే అట. అంతేకాదు షోలో కూడా ఈ ఇద్దరు ఉంటున్నారని తెలుస్తుంది. 


ఇప్పటికే బిగ్ బాస్ లో సంచలన దర్శకుడు నటుడు అంతకుమించి రచయిత పోసాని కృష్ణమురళి ఉంటున్నారని తెలుస్తుంది. అసలు షోనే కాంట్రవర్సీ ఇక పోసాని లాంటి డేరింగ్ డ్యాషింగ్ యాక్టర్ ఉంటే ఇక ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఈ షో కోసం పోసానికి దాదాపు రెండున్నర కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్.   


ఓ విధంగా తారక్ తర్వాత ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్న వారిలో పోసాని సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. సో ఓ పక్క అందాల భామలు మరో పక్క పోసాని గారి మాటల గారడి ఈ లెక్కన రియాలిటీ షో నిజంగానే అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందని చెప్పొచ్చు. రెండు సీజ్ఞలు 45 కోట్ల బడ్జెట్ తో రాబోతున్న బిగ్ బాస్ షోకి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ 7 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం తారక్ బాబి డైరక్షన్ లో జై లవకుశ సినిమా చేస్తున్నాడు.       


మరింత సమాచారం తెలుసుకోండి: