దిల్ రాజు నిర్మించిన దువ్వాడ జగన్నాధం సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యింది. హరీష్ శంకర్ డైరక్షన్ లో అల్లు అర్జున్ పూజా హెగ్డే లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా మంచి కలక్షన్స్ తో దూసుకేల్తుంది. ఇక ఈ సినిమా థ్యాంక్స్ మీట్ లో దిల్ రాజు స్పీచ్ అదరగొట్టారు. సినిమాకు అమెరికా నుండి కాల్ వచ్చింది.. మొదటి సగం బాగుంది.. సెకండ్ హాఫ్ సోసోగా ఉందని హ్యాపీగా పాజిటివ్ రివ్యూ వచ్చిందని రిలాక్స్ అయ్యాను.. ఇక నెల్లూరు కాల్ వస్తే ఫస్ట్ హాఫ్ సోసోగా ఉంది సెకండ్ హాఫ్ బాగుందని అన్నారు. సో ఒక చోట టాక్ మరో చోటా ఇలా సంబంధం లేకుండా ఉంది. శ్రీరాములు ఈవినింగ్ షో చూశాక ఇక సినిమా హిట్ అని ఫిక్స్ అయ్యామని అన్నారు దిల్ రాజు.  


తమ బ్యానర్లో వచ్చిన 25వ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని నిర్మాత దిల్ రాజు అన్నారు. 25 సినిమాలు తీసిన తన బ్యానర్లో అందరు హీరోలు పనిచేశారు. అందరు హీరోలతో తను వర్క్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క హీరోతో ఈ సంస్థలో సినిమాలు తీస్తాం.. తీయాలి. ఇక సోషల్ మీడియాలో అభిమానులు మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం. ఒక హీరో అభిమాని అని కాదు బాహుబలి తర్వాత డిజె అందుకున్న విజయం గురించి బాంబే నుండి పాజిటివ్ ట్వీట్స్ వచ్చాయి. 


డిజె సినిమా చూసి హింది సినిమాలు ఇలా తీయడని ట్వీట్స్ వచ్చాయి. అది తెలుగు సినిమా స్టామినా.. మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు.. ఏ హీరో అభిమాని మరో హీరోని కించ పరచొద్దు అందరం కలిసి తెలుగు వాళ్లం తెలుగు సినిమా స్టామినా పెంచుదామని అన్నారు దిల్ రాజు. డిజె మీద నెగటివ్ రావడం వల్ల నిర్మాత దిల్ రాజు ఎప్పుడు లేనిది చాలా హాట్ హాట్ గా మాట్లాడారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: