పూరీ జగన్నాథ్ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన రోజునే దసరా విడుదల అని ప్రకటన కూడా చేసేసారు. సెప్టెంబర్ 29 కి ఒక రోజు ముందుగా అయినా వస్తాం అని పూరీ గట్టిగానే చెప్పాడు. ఈ మధ్యన ఒక సినిమాకి పోటీగా మరొక సినిమా రావడం పరిపాటి అయిపోవడం తో ముందుగానే ప్రకటన చేసాడు పూరీ జగన్నాథ్. కానీ ముందుగా డేట్ చెప్పినా కూడా ఇతర సినిమాలు విడుదల కి సిద్దం అవుతూ ఉండడం తో బాలయ్య ఈగో హర్ట్ అయ్యింది అంటున్నారు. స్పైడర్ దసరా విడుదల కి సిద్దం అవుతూ ఉంటె మరొక పక్క జై లవకుశ కూడా విడుదల దగ్గరకి వచ్చేసింది. తన సినిమాకి స్పేస్ ఇవ్వడం లేదు అని బాలయ్య విపరీతంగా బాధపడుతున్నారు అని తెలుస్తోంది. సెప్టెంబర్‌ 29 వరకు వేచి చూడవద్దని, ఎవరు వచ్చినా రాకపోయినా 'పైసా వసూల్‌'ని సెప్టెంబర్‌ 27న విడుదల చేయాలని గట్టిగా చెప్పారట. 
బాలయ్య చెప్పిన తర్వాత ఇక ఆ మాటకి తిరుగు వుండదు కనుక 'పైసా వసూల్‌' సెప్టెంబర్‌ 27న రావడం ఖాయం చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: