‘బాహుబలి’ ప్రాజెక్ట్ తో ప్రభాస్ రానా అనుష్క లకు ఎంతో క్రేజ్ రావడమే కాకుండా వారి మార్కెట్ కూడ విపరీతంగా పెరిగింది. అయితే ‘బాహుబలి’ లో అవంతిక పాత్ర చేసి ఎంతో గ్లామర్ గా కనిపించినా ఆ మూవీ తమన్నా కెరియర్ కు ఏమాత్రం కలిసి రాలేదు. ప్రస్తుతం తమన్నా కెరియర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న నేపధ్యంలో ప్రభాస్ తమన్నాకు ఊహించని లిఫ్ట్ ఇవ్వడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం ‘సాహో’ సినిమా షూటింగ్ కోసం ముంబాయిలో ఉన్న ప్రభాస్ ను ఎందరో ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాతలు వారి సినిమాలలో ప్రభాస్ ను నటింప చేయాలని కోట్లాది రూపాయల భారీ పారితోషికం ఆఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ మాత్రం తన మనసులోని మాట బయట పెట్టకుండా తనను కలుస్తున్న బాలీవుడ్ ప్రముఖులు అందరూ చెప్పే విషయాలను కథలను వింటున్నాడు.

అయితే ఎవరూ ఊహించని విధంగా ప్రభాస్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఒక బాలీవుడ్ మూవీలో ప్రత్యేక పాత్రను చేయడానికి తన అంగీకారాన్ని తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ వెనుక తమన్నా సూత్రధారి అని అంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో తమన్నా ప్రభుదేవాలు నటిస్తున్న ‘ఖామోషీ’ చిత్రంలో ప్రభాస్ ఒక ప్రత్యేక పాత్రను చేయడానికి అంగీకరించాడు అంటూ బాలీవుడ్ మీడియా కథనాలు వ్రాస్తోంది. 

ఈ మూవీలో ప్రభాస్ నటించే పాత్ర చిన్నదే అయినప్పటికీ ఆసినిమా కథ రీత్యా ఇది చాల కీలకం అని అంటున్నారు. చక్రీ తోలేటి దర్శకత్వంలో వషు భగ్నాని నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం కోలీవుడ్ లో విడుదలైన ‘కొలైయుథిర్ కాలం’ కు హిందీ రీమేక్. తమిళ్ లో ఈపాత్రను నయనతార చేసింది.

ప్రస్తుతం హిందీలో రీమేక్ అవుతున్న ఈసినిమా క్రేజ్ ను పెంచడానికి ఈ చిత్ర నిర్మాతలు వ్యూహాత్మకంగా ప్రభాస్ పేరును వాడుకుంటున్నారు. గతంలో యాక్షన్ జాక్సన్ అనే బాలీవుడ్ సినిమాలో ఇలాగే ప్రభాస్ ఓకే ప్రత్యేక పాత్రను చేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే తమన్నా కోసం చేస్తున్న ఈ ప్రయోగం ఎంత వరకు ప్రభాస్ కు కలిసి వస్తుందో చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: