డిజె సక్సెస్ తో దూసుకెళ్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాత సినిమా వక్కంతం వంశీతో చేస్తున్న సంగతి తెలిసిందే. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అంటూ రాబోతున్న బన్ని తన సినిమాల సెలక్షన్ విషయంలో కొన్ని మార్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వంశీ సినిమా చేస్తున్న బన్ని ఆ తర్వాత లెక్క ప్రకారం తమిళ దర్శకుడు లింగుస్వామితో చేయాల్సి ఉంది.


రెండేళ్ల నుండి కాంబినేషన్ సెట్ అవుతుందనుకుంటే ఇంకా టైం పట్టేట్టు ఉంది. సరైనోడుతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ డిజె మొదట టాక్ యావరేజ్ అని వచ్చినా తన స్టామినాతో హిట్ మార్క్ అందుకున్నాడు. అయితే వంశీ సినిమా కొంత నేషనాలిటీతో ఉంటుందట. సినిమా సెంటిమెంటల్ గా సాగుతుందని టాక్. అందుకే ఆ తర్వాత సినిమా మళ్లీ ఓ మాస్ మసాలా సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడట బన్ని. 


అందుకోసమే మాస్ డైరక్టర్ తో సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాడు. లింగుస్వామి మాస్ డైరక్టరే కాని అతనితో తెలుగు తమిళ భాషల్లో సినిమా తీయాలని అనుకున్నాడు బన్ని కాబట్టి అది ఇప్పుడప్పుడే జరిగేట్టు కనబడటం లేదు. వినాయక్, సురేందర్ రెడ్డి ఇలా తనకు మాస్ ఇమేజ్ తెచ్చిన డైరక్టర్లతో మళ్లీ పనిచేయాలని చూస్తున్నాడట బన్ని.


నా పేరు సూర్య పూర్తి చేయడానికి ముందే ఆ తర్వాత చేయబోయే సినిమా మీద కూడా దృష్టి పెట్టబోతున్నాడట. పక్కా మాస్ అంశాలతో సినిమా కథ ఉండాలంటే ఇప్పటికే దర్శకులకు చెప్పినట్టు టాక్. సో మరోసారి బన్ని మాస్ మసాలా సినిమాతో వస్తున్నాడన్నమాట. బన్ని మాస్ సినిమా తీస్తే అది పక్కా హిట్ అన్నట్టే లెక్క.



మరింత సమాచారం తెలుసుకోండి: