స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లీడ్ రోల్ లో వచ్చిన సినిమా దువ్వాడ జగన్నాధం. హరిశ్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దె నటించింది. రిలీజ్ నాడు యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓవరాల్ గా మంచి కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. అల్లు అర్జున్ కెరియర్ లో సూపర్ హిట్ మూవీగా నిలవబోతున్న ఈ సినిమాతో ఎన్.టి.ఆర్ ను పోల్చి చూస్తున్నారు కొందరు ఫ్యాన్స్.


డిజెలో బన్ని శాస్త్రిగా బ్రాహ్మణ పాత్రలో అదరగొట్టాడు. అయితే ఇదవరకే అదే బ్రాహ్మణ పాత్రలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అదుర్స్ లో చారిగా ప్రతిభ చాటాడు. స్టార్ సినిమా అంటే నెగటివ్ ప్రచారం కామనే. కాని డిజె విషయంలో అది మితిమీరింది ఎంతలా అంటే ఏకంగా ఆ సినిమా దర్శకుడు హరిష్ శంకర్, నిర్మాత దిల్ రాజు థ్యాంక్స్ మీట్ లో మండిపోయేంత.


హీరోల్లో బ్రాహ్మణ పాత్ర చేసిన వారు తక్కువ కాబట్టి ఎన్.టి.ఆర్ అదుర్స్ తో డిజె బన్నిని పోల్చి చూస్తున్నారు. ఎవరి యాక్టింగ్ స్కిల్స్ వారివి అంత మాత్రాన తారక్ లా బన్ని చేయలేదని.. లేదా బన్ని తారక్ కన్నా బాగా చేశాడని ఫ్యాన్స్ ఒకటే రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే డిజెపై వచ్చిన కామెంట్లు అన్ని ఇన్ని కావు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నంలోనే డిజె థ్యాంక్స్ మీట్ లో అందరు అలా మాట్లాడారు.


హరిష్ శంకర్ అయితే ఇంకాస్త ఎక్కువ క్లాస్ పీకాడని చెప్పాలి. ఆరోజుల్లో ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉందని ఇప్పుడు సోషల్ మీడియాలో బూతు తిట్టుకుంటున్నారని అన్నారు హరిష్. సినిమా సక్సెస్ అయ్యిందన్న సంతోషం కన్నా తన హీరో క్యారక్టరైజేషన్ వేరే హీరోతో పోల్చి అవమానిస్తున్నారన్న బాధ హరిష్ లో ఎక్కువ కనబడింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: